బాధ్యతలు స్వీకరించిన నూతన తహసిల్దార్ సి.భాస్కర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల నూతన తహసిల్దార్ సి.భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసిల్దార్ తిరుమల్రావు బదలీపై ఆందోల్-జోగిపేట్ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళగా కంగ్రి మండల తహసిల్దార్ బాధ్యతలు నిర్వహించిన సి. భాస్కర్ బదలీపై ఝరాసంగం తహసిల్దార్ గా వచ్చారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ మండల ప్రజల సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పడికప్పుడు ప్రతి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యాలయానికి వచ్చే రైతులు ప్రజలను ఎలాంటి సమస్యలైనా పరిష్కరించి పనిచేస్తా మన్నారు,
