వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం గ్రామ చర్చ్ ముందు సిసి రోడ్డు పక్కన చెత్తకుండీలో ఉన్న చెత్తను గమనించి గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ వెంటనే స్పందించి అక్కడి నుంచి చెత్తను తీసేయాలని అక్కడ ఉన్న ప్రజలను ఏ ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామపంచాయతీ కార్మికులకు చెప్పి చెత్తను తీసివేయించడం జరిగింది. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వెంటనే స్పందించి గ్రామ పరిశుభ్ర గురించి ఆలోచించి వెంటనే సంధిస్తున్నారు.
చర్చి ముందు చెత్తను ఉంచకుండా చెత్తకుండీ నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలిపారు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగానే గ్రామ పంచాయితీ కార్యదర్శి వీరన్న పటేల్ గారి తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తు.గ్రామపంచాయతీ పరిశుద్ధ కార్మికులలో ప్రతి ఉదయం చెత్త సేకరణ, వివిధ వార్డులతో పాటు ప్రధాన రోడ్డును పరిశుభ్రత చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు,
