ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్…

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్

బహుమతులు అందజేసిన ఎస్ఐ పవన్ కుమార్

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన పదవ తరగతి టాలెంట్ టెస్ట్ విజేతలకు ఎస్ఐ పవన్ కుమార్ కళాశాల చైర్మన్ సిరికొండ శ్రీనివాస్ లు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి సిరివెన్నెల,రెండవ బహుమతి ఎస్ఆర్ స్కూల్ ఉతమ్ శెట్టి,ప్రభుత్వ పాఠశాల నుండి మొదటి బహుమతి అక్షయలు బహుమతులు అందుకున్నారు.ఈ సందర్బంగా అతిధులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి వారి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని అలాగే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.మార్చి పద్నాలుగు నుండి జరగబోయే పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి భయం లేకుండా మంచిగా రాసి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్,ప్రభుత్వ గర్ల్స్ స్కూల్ ఇన్చార్జి కల్పన,పద్మ, ధనలక్ష్మి,విద్యార్థులు పాల్గొన్నారు.

ఓటు హక్కు వినియోగించిన మహిళ కన్వీనర్ కడారి జ్యోతి…

ఓటు హక్కు వినియోగించిన మహిళ కన్వీనర్ కడారి జ్యోతి

పరకాల,నేటిధాత్రి

 

పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మేదరివాడలోని 13వ వార్డులో గల ప్రాధమిక పాఠశాలలో 26వ బూత్ నంబర్లో గల తమ ఓటు హక్కును పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ మహిళ కన్వీనర్ కడారి జ్యోతి వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు పౌరుని యొక్క బాధ్యతని వేసిన ఓటు సమాజానికి ఉపయోగపడలని పట్టణాలను అభివృద్ధి పరిచే నాయకులకు ఓటువేయాలని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version