అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ నీళ్లు కు ప్రజలు ఇబ్బందులు…

అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ నీళ్లు కు ప్రజలు ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ లో మిషన్ భగీరథ అధికారుల సమన్వయ లోపం కారణంగా మిషన్ భగీరథ నీళ్లు జహీరాబాద్ నియోజకవర్గం ప్రజల కు సకాలంలో అందకపోవడంతో ప్రజలు విచారణ వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అధికారులు స్పందించాలని డి ఈ మరియు ఏ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలవక జహీరాబాద్ పట్టణం ప్రజలతోపాటు నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి డి ఈ, మరియు ఏ ఈ మరియు కిందిస్థాయి సిబ్బంది కోఆర్డినేషన్ చేసుకొని ప్రజలకు నీళ్లు అందించాలని నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు. అధికారులు ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎందుకంటే వారి ఫోన్లు సైతం ఎత్తకపోవడంతో ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పోతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version