ఎస్ జి వి పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం వేడుకలు

ఎస్ జి వి పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

చెన్నూరు ఎస్ జి వి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా సుధాకర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ కెవి సత్యనారాయణ,టిఆర్ఏ ఎస్ఎంఎ జిల్లా కార్యదర్శి కోరల్ల శ్యాంసుందర్,టిఆర్ఏ ఎస్ఎంఎ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ సమీర్,సి ఆర్ పి పుప్పాల ప్రవీణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నవోదయ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు.అనంతరం ఎంఈఓ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.అలాగే నవోదయలో ఆరవ ర్యాంక్ సాధించిన చిలువేరు శ్రీహసన్ ను ప్రత్యేకంగా అభినందించారు.

నవోదయ ఫలితాల్లో గీతాంజలి డిజి.!

నవోదయ ఫలితాల్లో గీతాంజలి డిజి ప్రైమరీ విద్యార్థుల ప్రభంజనం

నర్సంపేట,నేటిధాత్రి:

 

2025 జనవరి న జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా ఈ ఫలితాల్లో నర్సంపేట
పట్టణంలోని గీతాంజలి డిజి ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు.ఈ ఫలితాల్లో విద్యార్థులు పి. అభిరామ్, కే. అశ్విత మరియు వి. హిమబిందులు సీట్లు సాధించారని చైర్మన్ వేముల సుబ్బారావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం సీట్లు సాధించడం చాలా సంతోషకరమని చైర్మన్ పేర్కొన్నారు.కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దానంతట అదే వస్తుందనే దానికి నిదర్శనమని తెలిపారు.ఈ సందర్బంగా పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు.అనంతరం కష్టపడ్డ ప్రతీవిద్యార్ధికి,ఉపాధ్యాయులకు,సహకరించిన పోషకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సౌజన్య రావ్, వైస్ ప్రిన్సిపాల్ విమల,ఇంచార్జి జాగృతి, మాథ్స్ ఉపాధ్యాయులు రాజు, అశోక్, చిరంజీవిలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version