మంజీరా నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య…

మంజీరా నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం హద్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చాల్కి సమీపంలో గల మంజీర నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై దోమ సుజిత్ తెలిపారు. నారాయణఖేడ్ డిపోలో పనిచేస్తున్న ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన పాపయ్య ముదిరాజ్ నారాయణఖేడ్ బస్సు డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు అని తెలిపారు. శుక్రవారం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరిన పాపయ్య మంజీర నది సమీపంలోకి వచ్చి కూతురితో బంధువులతో మాట్లాడి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో కాల్ ద్వారా తెలియపరిచాడు. బంధువులు కుటుంబ సభ్యులు అక్కడికి చేరేసరికి పాపయ్య మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆయన మృతదేహం లభించలేదు శనివారం సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని శవాన్ని తీశామని ఎస్సై తెలిపారు తర్వాత పంచనామా నిర్వహించి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు శవాన్ని అప్పగించామన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.

సంగారెడ్డి: వ్యక్తి అదృశ్యం.. మంజీరా నదిలో గాలింపు…

సంగారెడ్డి: వ్యక్తి అదృశ్యం.. మంజీరా నదిలో గాలింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం చాల్కీ గ్రామ శివారులో గల పాత వాటర్ ఫిల్టర్, మంజీరా నది ఒడ్డున నిన్న(శుక్రవారం) ఒక బండి, ఫోన్, దుస్తులు కనిపించాయి. అతను ఝరసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన తాటిపల్లి పాపన్న (42)గా గుర్తించారు. అతను నారాయణఖేడ్ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే అతను మంజీరా నదిలో మునిగి పోయినట్లు తెలుస్తోంది. దీంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుడి కూతురి ఫిర్యాదు మేరకు హద్నూర్ పోలీస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి. దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లు (కూతురు).. నేను చనిపోతున్న..?

కూతురితో.. వీడియోకాల్ లో మాట్లాడుతు మంజీరాలో దూకి ఆత్మహత్య..?
ఆర్టీసీ డ్రైవర్ పాపయ్య (42) శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై
న్యాల్ కల్ మండలం, చాల్కి గ్రామ శివారులోని మంజీరా నది ఒడ్డుకు చేరుకొని.. కూతురు స్వాతి (ముద్దు పేరు పిల్లు)తో వీడియో కాల్ లో మాట్లాడుతూ.. నేను చనిపోతున్నాను.. మీరు క్షేమంగా ఉండండి.. నాకు భయం, భయంగా ఉందంటూ ఏడుస్తూ.. వీడియో కాల్ ను మాట్లాడుతూ సెల్ ఫోను ఆపివేశాడు. భయాందోళనకు గురైన కూతురు స్వాతి (18), కుమారుడు హర్ష (15), కుటుంబీకులతో కలిసి ఘటన స్థలికి చేరుకున్నారు. మంజీరానది ఒడ్డున ద్విచక్ర వాహనం, దుస్తులు, పాదరక్షలు పడి ఉండడాన్ని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నాలుగు సంవత్సరాల క్రితం భార్య శశిరేఖ ఆత్మహత్య…

సంతానంతో జీవనం కొనసాగిస్తున్నాడు. నారాయణఖేడ్ లోని ఓ ప్రైవేట్ అదృశ్యమైన పాపయ్య (42) భార్య శశిరేఖ (35) నాలుగు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా నారాయణఖేడ్ పట్టణంలో నివాసము అంటూ పాపయ్య.. ఇద్దరి కళాశాల, విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. కూతురు స్వాతి (18) ఇంటర్, కుమారుడు హర్ష (15) 9వ తరగతి చదువుతున్నారు. కూతురు స్వాతి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు వ్యక్తి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ద్విచక్ర వాహనాన్ని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version