మంజీరా నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం హద్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చాల్కి సమీపంలో గల మంజీర నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై దోమ సుజిత్ తెలిపారు. నారాయణఖేడ్ డిపోలో పనిచేస్తున్న ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన పాపయ్య ముదిరాజ్ నారాయణఖేడ్ బస్సు డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు అని తెలిపారు. శుక్రవారం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరిన పాపయ్య మంజీర నది సమీపంలోకి వచ్చి కూతురితో బంధువులతో మాట్లాడి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో కాల్ ద్వారా తెలియపరిచాడు. బంధువులు కుటుంబ సభ్యులు అక్కడికి చేరేసరికి పాపయ్య మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆయన మృతదేహం లభించలేదు శనివారం సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని శవాన్ని తీశామని ఎస్సై తెలిపారు తర్వాత పంచనామా నిర్వహించి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు శవాన్ని అప్పగించామన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.
