రేవంత్ ఏడాదిన్నర పాలనలో..పుష్ప, హైడ్రా, మూసీ.!

రేవంత్ ఏడాదిన్నర పాలనలో..పుష్ప, హైడ్రా, మూసీ తప్ప ఏం లేదు

-బిజెపి మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీలంటూ అర చేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని మరిచిపోయిందని బిజెపి మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో పుష్ప, హైడ్రా, మూసీ, హెచ్ సీ యూ మీద పడ్డారే తప్పితే ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అసమర్థ, అవినీతి, అసత్య ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ లేని జీరో పరిపాలన సాగుతోందని..ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, విద్యా భరోసా కార్డు, చేయూత, ఆరోగ్యశ్రీ, లక్ష రూపాయలు, తులం బంగారం..ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని విమర్శించారు. రాను రాను సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుందని, రేవంత్ రెడ్డి ని కేసీఆర్ జైలులో వేస్తే..రేవంత్ కనీసం ఆ ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version