మండలంలో కాపర్ దొంగలు హల్ చల్
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల మోతే గ్రామపంచాయతీ పరిధిలోని మోతే గ్రామ శివారులో , ఏల్లు సోమిరెడ్డి వాసిరెడ్డి రాజేందర్ రెడ్డి వ్యవసాయ పొలంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారలను బుధవారం రోజు తెల్లవారుజామున పగలగొట్టి కాపరు వైరును ఎత్తుకెళ్లిన దొంగలు మండలంలో గతవారం మద్దలగూడెంలో జరగగా ఈ వారం మోతే శివారులో రెండోసారి వరుస కాపర్ దొంగలు పెరుగుతున్నారు రైతులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం నీళ్లు పెడదామని వెళ్ళగా స్టార్టర్ లో కరెంటు లేకపోవడంతో ట్రాన్స్ఫారం కాడికి పోయి చూడగా ట్రాన్స్ఫారం కిందపడి ఉండగా దానిలో ఉన్న కాపర్ వైర్ ను దొంగలించడం జరిగింది తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
