మెథడిస్ట్ 95వ జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్ నగర్, ఆల్లిపుర్ రెవ. జి బి గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చ అవరణంలో నిర్వహిస్తున్న మెథడిస్ట్ 95వ ఉజ్జివ సభల జాతరకి డి.ఎస్. సుకుమార్ గారితో, డిస్ట్రిక్ట్ లే లీడర్ సరీన్ జాన్ గారితో,జనరల్ సెక్రటరీ రవికుమార్ గార్లతో మరియు పాస్టర్ లతో కలిసి రిబ్బన్ కట్ చేసి జండా ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డీసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
అనంతరం ఎమ్మెల్యే , చైర్మన్ గార్లు మాట్లాడుతూ గత 95 సంవత్సరాలుగా ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది అన్నారు. 3 రోజుల పాటు ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది అని ,ఇట్టి జాతరకు జహీరాబాద్. నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి జండా ఊరేగింపు తో వచ్చి దేవుణ్ణి మహిమ పరచడం జరుగుతుందని అన్నారు.