రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పు తొడిగిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి..

రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పు తొడిగిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పాషా
మెట్ పల్లి మార్చి 9 నేటి ధాత్రి

 

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి చెప్పులు తొడిగిన నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలని మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా కోరారు ఈ సందర్బంగ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహనికి చెప్పులు తొడగడం క్షమించరాని చర్య అని, నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణా ఉద్యమ సమయంలో రాజీవ్ గాంధి విగ్రహాన్ని ఉద్యమకారులు ధ్వంసం చేసారని, స్థానిక కాంగ్రెస్ నాయకుల సహకారంతో ఇటీవల బాగుచేయించామని, ఈ క్రమంలో ఇలాంటి చర్యలు చేపట్టడం అనైతిక చర్య అన్నారు. భారత దేశానికి వన్నె తెచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీ అని, రాష్ట్రాన్ని ప్రగతిపతంలో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నిందితులను ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version