తీవ్ర మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య…

తీవ్ర మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

మండలంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి మొగుళ్ళపల్లి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు. మొగుళ్ళపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన బాల వేణి రాధా చంద్రమౌళి దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు సంతానం ఉండగా కూతురు వివాహం చేసి బాల వేణి రాధా తన భర్త చంద్రమౌళి, ఇద్దరు కొడుకులతో కలిసి హైదరాబాదులో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు స్వగ్రామం మేదరమట్లకు వచ్చి బుధవారం భోగి రోజున వారి ఇంటిలో పట్నాలు వేసిన అనంతరం మృతుడు అంజి (21) కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు అంజిని వెతుకుతున్న క్రమంలో మృతుడు తన పెదనాన్న బాలవేణి వెంకన్న గృహంలో రాత్రి 7:30 గంటల సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకుని కొన ఊపిరితో వేలాడుతు కనిపించడంతో. కొడుకును చూసి తల్లి బాలవేణి రాధా కేకలు వేయగా. గ్రామానికి చెందిన బాలవేణి వీరస్వామి, బాలవేణి శ్రీనివాసులు, ఇద్దరు కొనఊపిరితో ఉన్న అంజిని హుటాహుటిన చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని. తన కుమారుడి ఆత్మహత్యకు ఎవరిమీద ఎలాంటి అనుమానం లేదని ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి బాలవేణి రాధా ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బొరగల అశోక్ తెలిపారు.

“మెదరమెట్లలో బీజేపీ ప్రచారం వేగం”

*మెదరమెట్ల గ్రామం అభివృద్ధి చెందాలంటే బిజెపి బలపరిచిన చింతకింది మౌనిక సాయిరాం బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలానికి చెందిన మెదరమెట్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చింతకింది మౌనిక సాయిరాం గారు ఇంటింటి ప్రచారం వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, గ్రామ అభివృద్ధిని వేగవంతం చేయడానికి బీజేపీ అభ్యర్థి గెలుపు అత్యంత కీలకమని గ్రామస్తులకు వివరించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి గారు పాల్గొని, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంక్షేమ పథకాలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామానికి కావాల్సిన రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, పేదలకు కల్పించే సేవలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు బీజేపీ అభ్యర్థి మౌనిక సాయిరాం గారు కృషి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజలు అభ్యర్థికి మంచి స్పందన ఇస్తూ, అభివృద్ధి పరమైన మార్పుల కోసం బీజేపీకి తమ మద్దతు తెలుపుతున్నారు. బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలంటూ డాక్టర్ కీర్తి రెడ్డి గారు కోరారు.

 

కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి హరికృష్ణ,వీరన్న,మల్లారెడ్డి ప్రభాకర్,లింగమూర్తి.రాజయ్య నగేష్ సతీష్ ఓదెలు వెంకటేష్. సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version