కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణ…

కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణ

-రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం

-దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకోలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమట్ల గ్రామానికి చెందిన పసునూటి బాలకృష్ణ గత ఆరు సంవత్సరాల నుండి కండరాల క్షీణిత వ్యాధితో బాధపడుతుండేవాడు. రూ.10 లక్షల వరకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఖర్చు పెట్టుకున్నప్పటికీ..ఆ వ్యాధి నయం కాకుండా మంచాన పడ్డాడు. దీంతో విధి వక్రీకరించిన ఆ కుటుంబం వీధిన పడ్డట్లయ్యింది. పసునూటి బాలకృష్ణకు భార్య స్రవంతి ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, విష్ణు ప్రియలున్నారు. రోజువారి కూలి పనులు చేసుకుంటూ..భార్య శిరీష కుటుంబ జీవనాన్ని వెల్లదీస్తుంది. దీనికి తోడు కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణకు నెలకు రూ. 20వేల వరకు మెడిసిన్ ఖర్చు అవుతుంది. అలాగే అదే వ్యాధితో పసునూటి బాలకృష్ణ సోదరీమణులు బాధపడుతున్నారు. కండరాల క్షీణిత వ్యాధి నుంచి బాధపడుతున్న వీరిని రక్షించేందుకు మానవత్వం కలిగి ఉన్న దాతలు స్పందించి..రెక్కాడితే గానీ డొక్కాడని ఆ నిరుపేదల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఆ కుటుంబాలకు విరాళాలు ఇచ్చి..బాధిత కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు వచ్చే దాతలు ఫోన్ పే నెంబర్ 8309029249, గూగుల్ పే నెంబర్ 9666321300 లకు విరాళాలు ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

సీజన్ వ్యాధుల పట్ల అవగాహన. ‌

-సీజన్ వ్యాధుల పట్ల అవగాహన. ‌

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మేదరమట్ల గ్రామంలో మొగుళ్ళపల్లి వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో డాక్టర్ వాణి (MLHP)ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ గారు మాట్లాడుతూ వర్షాలు అధికంగా ఉండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , లేనిచోఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున, వర్షంలో ఎక్కువగా తిరగకూడదని ,అదేవిధంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలని ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేనిచో సీజన్ వ్యాధులు మలేరియా డెంగ్యూ ,చికెన్ గున్యా, డయేరియా లాంటి వ్యాధులు ప్రజలు అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బందికి తెలియజేయాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఈ యొక్క మేదరమట్లవైద్య శిబిరంలో 66 మంది కి వైద్య పరీక్షలు చేసి రెండు జ్వర పీడితులను గుర్తించి రక్త నమూనాను తీసి ల్యాబ్ పంపినారు. అలాగే గ్రామంలో దోమలు లార్వా రాకుండా తిమోఫాస్ దోమల మందను పిచ్చికారి చేయడం అయినది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంషబీద, పంచాయతీ సెక్రెటరీ, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది ,ప్రజలు పాల్గొన్న .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version