కోటగుళ్లలో ఘనంగా శ్రావణ సోమవారం పూజలు

కోటగుళ్లలో ఘనంగా శ్రావణ సోమవారం పూజలు

ఆలయంలో భక్తుల కోలాహలం

స్వామివారికి రుద్రాభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ప్రారంభించారు. అనంతరం నందీశ్వరుడు, గణపేశ్వరునికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామి వారిని నాగాభరణం పట్టు వస్త్రాలతో వివిధ రకాల పూలమాలతో కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణ సోమవారం సందర్భంగా స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం తులసి, మారేడు, ఉసిరి, తెల్ల జిల్లేడు, మేడి, నాగదేవుని పుట్ట వద్ద మహిళలు దీపాలను వెలిగించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.

ఘనంగా వెంకటేశ్వర స్వామి లక్ష పుష్పార్చన

ఘనంగా వెంకటేశ్వర స్వామి లక్ష పుష్పార్చన

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై రామానుజాచార్యులు పర్యవేక్షణలో పొడిచేటి శేషాచార్యులు ముడుంబై శ్రీకరాచార్యులు కార్యక్రమాన్ని చేపట్టారు.ఆలయ చైర్మన్ ఎర్ర జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 13 న ఉదయం 10 గంటలకు సుదర్శన నరసింహ యాగము లోక కళ్యాణార్ధం జరుపనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు,మహిళలు,భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version