ఘనంగా టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు జన్మదిన వేడుకలు…

ఘనంగా టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు జన్మదిన వేడుకలు

మెట్ పల్లి నేటి ధాత్రి

 

టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజీత్ రావు జన్మదినం సందర్భంగా మెట్ పల్లి పట్టణం లో కాంగ్రెస్ కార్యాలయం లో ప్రత్యేకంగా తయారుచేసిన కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ,ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి టీపీసీసీ నాయకులు కల్వకుంట్ల సుజీత్ రావు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా అర్హులైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కోరుట్ల నియోజకవర్గంలో అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, ఎల్ఓసీ చెక్కులు అందించడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలోని గ్రామాలు, వార్డులు, పట్టణాలు ఇలా అన్ని ప్రాంతాల్లో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారని అన్నారు. నియోజవర్గంలో అపరిష్కృత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళుతుండడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి టీపీసీసీ నాయకులు కల్వకుంట్ల సుజీత్ రావు అన్ని రకాల సహకారం అందిస్తారని ఆశ భావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుండి ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి తాము సైతం భాగస్వాములు అవుతుండడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా పాషా, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ములచిన్నారెడ్డి,పాతధాంర
జ్ పల్లి ఉప సర్పంచ్ ఇప్పపల్లి గణేశ్,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోడిమ్యాల దీపక్ రాజ్, ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్, మామిడి రాజశేఖర్,ఎండి జాఫర్, మొగిలి రాజేందర్,బైండ్ల శ్రీకాంత్, కోరే రాజ్ కుమార్,అయ్యప స్వాములు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అనాధ బాలికలకు అండగా ఉంటకోరుట్లనియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు..

అనాధ బాలికలకు అండగా ఉంటకోరుట్లనియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు
మల్లాపూర్ ,నేటి దాత్రి

 

మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో తల్లి తండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన ఇద్దరు ఆడపిల్లలకు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రోజున ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులు అందజేశారు జువ్వడి నరసింగరావు ఫోన్ ద్వారమాట్లాడి అనాధలైన ఆ ఇద్దరు ఆడపిల్లలకు ధైర్యం చెప్పారు వారికి అండగా ఉంటామని వారు చదువుకోడానికి సహకరిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏనుగు రాజారెడ్డి పొన్నం భూమానందం మిట్టపల్లి రాజేశ్వర్ రెడ్డి మిట్టపల్లి నడిపి రాజారెడ్డి నేరెళ్ల రాజారెడ్డి నిమ్మల రాజేశం ఇనుగుర్తి వినోద్ మురళి సంతోష్ గుండో జి జనార్ధన్ ఎడమల నర్సారెడ్డి ఏనుగు రాజు బద్దం చిన్న రాజారెడ్డి ఎండి అకుర్ ఎలేటి రాజారెడ్డి బద్దం పెద్ద రాజారెడ్డి ముల్క గంగారం తదితరులు పాల్గొన్నారు

టీజీ గౌడ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా ప్రణయ్ గౌడ్…

టీజీ గౌడ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా ప్రణయ్ గౌడ్
మల్లాపూర్ అక్టోబర్ 21 నేటి ధాత్రి

 

తెలంగాణ గౌడ యువజన సంఘం కోరుట్ల నియోజకవర్గం అధ్యక్షునిగా బాలసాని ప్రణయ్ గౌడ్ ను నియమిస్తూ మంగళవారం ప్రకటించారు.
జగిత్యాల జిల్లా అధ్యక్షులు బొంగాని పవన్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ అధ్యక్షుడు అమరవేణి నరస గౌడ్ జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ధరామయ్య గౌడ్ ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రణయ గౌడ్ ను ఎన్నుకున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు అలాగే గౌడ కులస్తుల కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

టీపీసీసీ లీగల్ సెల్ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ గా ఎం.డి.రజాక్…

టీపీసీసీ లీగల్ సెల్ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ గా ఎం.డి.రజాక్
మెట్ పల్లి సెప్టెంబర్ 23 నేటి దాత్రి

 

మెట్ పల్లి పట్టణం: పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన కోరుట్ల అసెంబ్లీ నియిజకవర్గ లీగల్ సెల్ కమిటీ సభ్యులకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు నియామక ఉత్తర్వులను అందించారు. కన్వీనర్ గా సీనియర్ న్యాయవాది ఎం.డి.రజాక్, కో కన్వీనర్లుగా కస్తూరి రమేష్, మన్నే గంగాధర్, జాయింట్ కన్వీనర్లుగా వంగవేణు, నేరెళ్ల శ్రీధర్, జనరల్ సెక్రటరీ గా నల్ల రాజేందర్, జాయింట్ సెక్రెటరీలుగా గజ్జి గంగారాం, మద్దుల రోజా లకు నియామక ఉత్తర్వులు అందించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం ల సూచన మేరకు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియామక ఉత్తర్వులు పంపినట్లు టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్, సీనియర్ న్యాయవాది కోటగిరి వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్బంగా నియామక ఉత్తర్వులు అందుకున్న న్యాయవాదులు వారి నియామకానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, ఏజిపి అబ్దుల్ హఫీజ్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి లింగం, కార్యదర్శి రాంప్రసాద్, న్యాయవాదులు తెడ్డు ఆనంద్, సురక్ష, కోటగిరి చైతన్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version