కోహిర్ లో మునిసిపల్ ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహించిన
◆-: రాష్ట్ర మైనారిటీ సంక్షేమా శాఖ మంత్రివర్యులు మహమ్మద్ అజారోద్దీన్
◆-: మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్
◆-: రాష్ట్ర సెట్విన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ పట్టణ కేంద్రంలోని మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.ఈ ప్రచారానికి పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర మంత్రివర్యులు మహమ్మద్ అజారోద్దీన్ మాజీ మంత్రివర్యులు డా||చంద్రశేఖర్,మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు అయిన కోహిర్ మునిసిపాల్టీలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి ,అన్ని వార్డులను కైవసం చేసుకొని కాంగ్రెస్ విజయ దుందుభిని కొనసాగించాలని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి,కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, పట్టణ అధ్యక్షులు శంషీర్ తదితరులు పాల్గొన్నారు…
