ఈనెల 24న చలో ఇందిరా పార్క్ ధర్నా…

ఈనెల 24న చలో ఇందిరా పార్క్ ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 24న హైదరాబాదులో జరగబోయే ధర్నా కార్యక్రమం గురించి బీసీ జేఏసీ కన్వీనర్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుటకు సిరికొండ మధుసూదన చారి జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ బాలరాజు గౌడ్ అన్ని బీసీ సంఘాల మద్దతుతో ఇందిరా పార్కు వద్ద హైదరాబాదులో నిర్వహిస్తున్న భారీ ధర్నా కార్యక్రమానికి బీసీ లందరూ ఐక్యంగా పాల్గొని ధర్నాని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో భవిష్యత్తు ప్రణాళిక మహా పోరాటాన్ని ప్రకటించనున్నందున బిసి, ఎస్సీ ఎస్టీ లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టేకుమట్ల ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకినపల్లి శ్యామ్ , వర్తక సంఘం అధ్యక్షులు బొడ్డు సదానందం, ముదిరాజ్ మండల నాయకులు ఎలవేణి రాజేందర్ ,పద్మశాలి మండల అధ్యక్షుడు మాచర్ల మహేందర్, నాయిని బ్రహ్మ మండలం అధ్యక్షుడు మేడిపల్లి నరేష్ ,విశ్వకర్మ నాయకులు ఆపోజి దేవేందర్ నాయకులు,పద్మశాలి మండల నాయకులు బండిరాజేంద్రప్రసాద్, మైనారిటీ మండల నాయకులు ఎండి కాజా, యాదవ సంఘం నాయకులు రాజయ్య,రజక సంఘం ఉపాధ్యక్షుడు నిమ్మల స్వామి, మండల నాయకులు వారాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సయ్యద్ అసద్ ఆధ్వర్యంలో, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ జన్మదిన వేడుకలు….

సయ్యద్ అసద్ ఆధ్వర్యంలో, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ జన్మదిన వేడుకలు

కాశీబుగ్గ మధర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ లో అన్నదానం

నేటిధాత్రి, కాశీబుగ్గ.

హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ జన్మదిన వేడుకలు వరంగల్‌లో ఘనంగా నిర్వహించారు. కాశీబుగ్గకు చెందిన దివ్యాంగుడు సయ్యద్ అసద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు 19వ డివిజన్ లోని మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్‌లో జరిగాయి. ఈ సందర్భంగా మానసిక వికలాంగుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారు కమిషనర్ ఏవి రంగనాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సయ్యద్ అసద్ మాట్లాడుతూ, రంగనాథ్ సార్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు తనకు న్యాయం చేశారని తెలిపాడు. హైడ్రా సంస్థ కార్యకలాపాలు ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆ సంస్థ వరంగల్ ట్రై సిటీలో కూడా విస్తరించాలని కోరారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూములు, భూకబ్జాలు విస్తృతంగా జరుగుతున్నాయని, వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, సేవా సంస్థ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

రైతు దుర్గయ్య మరణం… తోనిగండ్లలో విషాద ఛాయలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T140655.340.wav?_=1

 

రైతు దుర్గయ్య మరణం… తోనిగండ్లలో విషాద ఛాయలు..

రామాయంపేట, అక్టోబర్ 22 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన రైతు పేగుడ దుర్గయ్య (68) మృతి చెందడంతో గ్రామం మొత్తానికి విషాద ఛాయలు అలుముకున్నాయి.
సుమారు 25 రోజుల క్రితం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కళ్లుచిరుగి పొలం వద్దనే కుప్పకూలిన దుర్గయ్యను చుట్టుపక్కల రైతులు గమనించారు. వెంటనే స్పందించిన వారు 108 అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వగా, అతన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి ఆయనకు రక్తపోటు అత్యధికంగా పెరగడంతో కోమాలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. అక్కడి నుండి హైదరాబాద్‌కు తరలించిన కుటుంబ సభ్యులు, మేడ్చల్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించారు. అయితే 26 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన దుర్గయ్య చివరకు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.
రైతు దుర్గయ్య భార్య లక్ష్మి కూడా సుమారు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను విడిచి వెళ్లిపోయిన దుర్గయ్య మృతితో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల విలాపాలతో తోనిగండ్ల గ్రామం మునిగిపోయింది.
గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు దుర్గయ్య కుటుంబానికి సానుభూతి తెలిపారు. “ఆయన ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. కుటుంబం కోసం జీవితాంతం శ్రమించారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేం” అని గ్రామస్థులు కన్నీటి కణాలతో గుర్తుచేశారు.

మా “అబ్బాయి పెళ్లికి రండి”..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T190916.442.wav?_=2

 

 

మా “అబ్బాయి పెళ్లికి రండి”.

“నిహాంత్” పెళ్లి వేడుకకు హజరై వదూవరులను దీవించండి.

“సిఎం రేవంత్ రెడ్డి”ని కలిసి శుభలేఖ అందజేసిన “సుభాష్ రెడ్డి”.

వివాహానికి తప్పకుండా హజరై వదూవరులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి.

తన కుమారుడు “నిహాంత్” పెళ్ళి శుభలేఖ “సిఎం”కు అందజేసిన “సుబాష్ రెడ్డి”.

 

“నేటిధాత్రి”,హైదరాబాద్.
మా అబ్బాయి నిహాంత్ పెళ్లికి రండి. వచ్చి మీ అమూల్యమైన ఆశీర్వనాలు అందించి దీవించండి. ప్రముఖ పారిశ్రామిక, రియల్ వ్యాపారి, మానవతా వాది, సామాజిక వేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిశారు. నవంబర్ 7 న తేదీన సుభాష్ రెడ్డి కుమారుడు నిహంత్ పెళ్లి వేడుక జరగనున్నది.

 

CM Revanth invited to Nihant’s wedding

తన కుమారుడి పెళ్ళికి హజరై నూతన వదూవరులను ఆశీర్వదించాలని కోరుతూ పెళ్ళి శుభలేఖను సిఎం. రేవంత్ రెడ్డికి అందించి సుబాష్ రెడ్డి ఆహ్వానం పలికారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాల్ కల్ బంద్….

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాల్ కల్ బంద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్థానిక న్యాల్ కల్ మండల కేంద్రం లోని బస్టాండ్ ముందు బీసీ సంక్షేమ సంఘం న్యాల్ కల్ మండల అధ్యక్షులు భోజగొండ శివరాజ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్య సంస్థలు దుకాణాలు ఇతర వ్యాపారాలు స్వచ్చందంగా బంద్ పాటించారు ఈ సందర్బంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 42 % శాతం బీసీ రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాలని, ఇచ్చిన హామీని అమలు చేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయక పోవడం కారణంగానే బీసీల “బంద్” కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బంద్ లో భాగంగా శాంతియుతంగా చేపట్టమని తెలిపారు ఈ రాష్ట్ర ప్రభుత్వనికి చిత్త శుద్ధి ఉంటే మీరు ఇచ్చిన బీసీ లకు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తాను అన్న మాయమాటలు చెప్పి ప్రభుత్వన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు బీసీలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ మల్గి సర్పంచ్ బీసీ సంఘం విద్యార్థి విభాగం ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మిర్జాపూర్ మాజీ సర్పంచ్ బీరప్ప చల్కి అశోక్ బీజేపీ మాజీ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ బీజేపీ మండలం అధ్యక్షులు మల్లేష్ బీజేవైఎం మండలం అధ్యక్షులు విష్ణు పాటిల్ మండలం ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సతీష్ కులకర్ణి మైనారిటీ సభ్యులు అసిఫ్ నర్సప్ప లావేష్ పాటిల్ రాజు యాదవ్ పాండు తదితరులు ఉన్నారు,

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు….

పుత్తడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

 

తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది.అంతర్జాతీయంగా కీలక పరిణామాలు, దీపావళి పండుగ దృష్ట్యా దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,180 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,690గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,85,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలులో ఉంటాయి.

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు..

హీరోయిన్ల ఓటర్ కార్డులు ఫేక్.. తేల్చిన ఈసీ, కేసు నమోదు

టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు.

 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్ పేరుతో ఓటర్ల జాబితా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఓటర్ల జాబితా సర్కులేషన్‌పై సిరియస్ అయిన ఎన్నికల అధికారులు.. తాజాగా ఆ ఓటరు జాబితా ఫేక్ అని తేల్చారు. ఈ మేరకు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమల్ మధుర నగర్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి పిర్యాదు మేరకు 336(4), 353(1)(C) BNS సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఅర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గత రెండు రోజులుగా జూబ్లీహిల్స్‌లో ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఫేక్ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నాల ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేసి కేటుగాళ్లు ప్రచారం చేశారు. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేశారు. ఈ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలనం.

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలనం.

◆:- కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

టీఆర్పీ పార్టీ లో ప్రజా సేన పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రజా సేన పార్టీ అధ్యక్షులు ఆవుల హన్మన్లు టీఆర్పీ పార్టీ లో విలీనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా, ప్రజా సేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్పీ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజా సేన పార్టీ నాయకులు, మహిళలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మాజీ ఉపరాష్ట్రపతి, భారత దేశ సైన్స్ పితామహుడు స్వర్గీయ అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతి లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రామకృష్ణాపూర్ పట్టణ తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ఎంపికైన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాజీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో గత 25 సంవత్సరాల నుండి విద్యారంగంలో చేసిన నిస్వార్ధ సేవలకు గాను అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్ తెలిపారు. అబ్దుల్ అజీజ్ కు కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంతో పట్టణంలోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం…

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు
ఈ సమావేశంలో, నాయకులు ఎన్నికల వ్యూహాలు, అట్టడుగు స్థాయిలో సంస్థను బలోపేతం చేయడం మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పార్టీ కేడర్‌ను సమీకరించడం గురించి చర్చించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి హజ్ కమిటీ మెంబర్ యూసఫ్ ,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ యువ నాయకులు మిథున్ రాజ్, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి కార్యకర్తలకు దిశానిర్దేశం….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-12T124639.405.wav?_=3

 

ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ పోచంపల్లితో కలిసి కార్యకర్తలకు దిశానిర్దేశం

 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశీస్ కుమార్ యాదవ్,మంగళారపు లక్ష్మణ్,పుస్తె శ్రీకాంత్,వాసాల వెంకటేష్,పర్వతం సతీష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

 

ఉమాకాంత్ పాటిల్‌ను పరామర్శించిన వై. నరోత్తం

ఉమాకాంత్ పాటిల్ ను పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కొద్దీ రోజుల క్రితం ప్రమాద వశాత్తు కాలుకు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న మాజీ సీడీసీ చెర్మన్ ఉమాకాంత్ పాటిల్ ను ఈ రోజు హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి పరామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం, పరామర్శించిన వారిలో యం.శ్రీనివాస్, యూ. మాణేన్న,టి.రాములు,టి.విఠల్,యం.శివన్న,యం.సంగ్రామ్,బి.అశోక్,కె.శ్రీశైలం,తదితరులు ఉన్నారు

హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో.. 151వ వారం అన్నదాన కార్యక్రమం….

హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో.. 151వ వారం అన్నదాన కార్యక్రమం….

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

హోప్ పౌండేషన్ చైర్మన్ కొండ విజయ్కుమార్ ఆద్వర్యంలో హుడాకాలనీలోని హోప్పాండేషన్ కార్యాలయం వద్ద ప్రతి శనివారం అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారంతో 151 వారానికి చేరుకుంది.

 

ఈ సంధర్భంగా సుమారు 2500 మంది పేదప్రజలు పాల్గొని అన్నసమారాధన గావించారు. ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి కడుపునిండ భోజనం చేస్తున్నామని పలువురు పేద ప్రజలు తెలిపారు. రోజంతా కష్టపడితేగాని పూటగడవదు, కాని ప్రతి వారం ఇక్కడ మాత్రం ఉచితంగా భోజనం లభిస్తుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోప్ ఎ ండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ కి పరామర్శ…

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ కి పరామర్శ

#కలెక్టర్ ను పరామర్శించిన మహాజన జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా రమేష్ బాబు

హన్మకొండ, నేటిధాత్రి:

 

కొన్ని రోజుల కిందట అనారోగ్య కారణంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి ఐఏఎస్ అత్తయ్య విజయలక్ష్మి చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న మహాజన జర్నలిస్ట్ ఫోరం ఎం జె ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు టీ 9 న్యూస్ ఛానల్ సీఈఓ జిల్లా రమేష్ బాబు హైదరాబాద్ లో వారి ఇంటికి వెళ్లి కలెక్టర్ ని మరియు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. జిల్లా రమేష్ బాబు తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు జిల్లా రాకేష్ ఉన్నారు.

రాష్ట్ర జట్టుకు ఎంపికైన గురుకుల విద్యార్థి…

రాష్ట్ర జట్టుకు ఎంపికైన గురుకుల విద్యార్థి

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి బాలబాలికల 17వ మినీ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడు కావేరి పార్ధు జాతీయస్థాయికి అర్హత సాధించినట్లు,వ్యాయామ ఉపాధ్యాయులు గాంధార్ల సంతోష్,పిడి.రత్నం శ్రీనివాస్,పి.ఇ.టి,తెలిపారు.సెప్టెంబర్ 26 నుండి 29 వరకు హైదరాబాదులోని నిజాం కాలేజీలో జరిగే,జాతీయ స్థాయి 17వ మినీ హ్యాండ్ బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు,
ప్రిన్సిపల్ కోల నాగేశ్వరరావు తెలిపారు.వీరిని పాఠశాల సీనియర్ వైస్ ప్రిన్సిపల్ స్రవంతి,జూనియర్ వైస్ ప్రిన్సిపల్ మహిపాల్, హౌస్ మాస్టర్ స్వర్ణలత,ఉపాధ్యాయ బృందం అభినందించారు.

దారుస్సలాంలో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T155047.403-1.wav?_=4

 

 

 

దారుస్సలాంలో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం పాల్గొన్న జహీరాబాద్ అధ్యక్షులు అథర్ అహ్మద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయం దారుస్సలాం లో సమావేశంలో, ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అథర్ అహ్మద్ కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తన ప్రసంగంలో, మజ్లిస్ జహీరాబాద్ అధ్యక్షుడు గతంలో మజ్లిస్ ప్రాతినిధ్యం వహించిన సమయంలో చేసిన పనులను సమీక్షించారు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ ను అభ్యర్థించారు తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ కు ధన్యవాదాలు తెలిపారు.

దారుస్సలాంలో అథర్ అహ్మద్ ప్రసంగం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T125516.956.wav?_=5

 

దారుస్సలాంలో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం పాల్గొన్న జహీరాబాద్ అధ్యక్షులు అథర్ అహ్మద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయం దారుస్సలాం లో సమావేశంలో, ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అథర్ అహ్మద్ కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తన ప్రసంగంలో, మజ్లిస్ జహీరాబాద్ అధ్యక్షుడు గతంలో మజ్లిస్ ప్రాతినిధ్యం వహించిన సమయంలో చేసిన పనులను సమీక్షించారు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ ను అభ్యర్థించారు తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ కు ధన్యవాదాలు తెలిపారు.

నెక్కొండ బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించండి..

నెక్కొండ బస్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించండి

రవాణా శాఖ మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే దొంతి

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి హైదరాబాదులోని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి పోన్నం ప్రభాకర్ అతి తొందరలో బస్టాండ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్ రావు, బానోత్ సింగ్ లాల్, నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మళ్లన్న నారి శక్తి లోగో ఆవిష్కరణ…

హైదరాబాద్ లో రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగోని లాంచ్ చేసిన ఎం ఎల్ సి తీన్మార్ మల్లన్న

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ కి చెందిన “నారి శక్తి” సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ జ్యోతి పండాల్ గారి ఆధ్వర్యంలో హైదరబాద్ లోని బిసి పొలిటికల్ జె.ఏ సి రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారిచే రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగో ను ఆవిష్కరించి తీన్మార్ మల్లన్న జ్యోతి పండాల్ ను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడతూ మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశం,రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పొలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, జె.ఏ సి నాయకులు కొనదొడ్డి నర్సింహ్మ (జహీరాబాద్ ఇంచార్జ్), తీన్మార్ మల్లన్న టీం శ్రీకాంత్, జగన్నాథ్, నాయకులు శ్రీ బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ సింగారం రవీందర్ కొట్ల వాసుదేవ్ సుతారపు రంగన్న తదితరులు పాల్గొన్నారు

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి…

నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్గా విశాలాక్షి విధుల్లో చేరారు. హైదరాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న విశాలాక్షిని ఇక్కడకు బదిలీ చేశారు. నూతన డిప్యూటీ కలెక్టరు కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. విశాలాక్షి మాట్లాడుతూ.. నిమ్జ్ రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version