మందమర్రి ఏరియాను సందర్శించిన జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి.
మందమర్రి నేటి దాత్రి
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి మందమర్రి ఏరియాను సందర్శించిన సందర్భంగా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మందమర్రి ఏరియా జి.ఎం జి.దేవేందర్ మరియు ఏరియా సీనియర్ అధికారులు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మందమర్రి ఏరియా యొక్క స్థితిగతులను వారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఏరియా ఇంజనీర్ డీ.జీ.ఎం (ఈ&ఎం), వెంకటరమణ, డీ.జీ.ఎం ఐ.ఈ.డి రాజన్న, డీ.జీ.ఎం (ఎఫ్ & ఏ) ఆర్.వి.ఎస్ ఆర్.కే ప్రసాద్, డివై, పి.ఎం మైత్రేయ బందు, ఐ.టీ సీనియర్ ప్రోగ్రామర్ రవి పాల్గొన్నారు.