పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ

*పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ*

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

కంటి వెలుగు పథకం స్పూర్తితో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన సొంతూరు హన్మకొండ జిల్లా నడికూడ మండలం వరికోలులో ఉచిత కంటి పరీక్ష, ఉచిత కళ్ల జోళ్లు పంపిణీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఇందులో భాగంగా ఉచిత కంటి పరీక్షల అనంతరం వారి కుమార్తె ఆశ్రిత రెడ్డి జన్మదిన సందర్బంగా ఉచిత కళ్ల జోళ్లను పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా పుట్టిన ఊరికి సేవ చేయాలన్న ఆలోచనతో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,ఉప సర్పంచ్ మూర్తాల భుజంగరావు, మాజీ వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి,బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు డేగరాజు,మండలంలోని వివిధ గ్రామాల నూతన సర్పంచులు,గ్రామ ప్రజలు బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రహదారి భద్రత మాసోత్సవం–2026లో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు..

రహదారి భద్రత మాసోత్సవం–2026లో భాగంగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

వరంగల్, నేటిధాత్రి:

 

రహదారి భద్రత మాసోత్సవం–2026 కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం (04-01-2025) రవాణా శాఖ కార్యాలయంలో హెవీ గూడ్స్ వెహికల్స్, మీడియం గూడ్స్ వెహికల్స్ డ్రైవర్లు మరియు ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO), వారి సిబ్బంది పర్యవేక్షణలో ఈ పరీక్షలు చేపట్టగా, దాదాపు 150 మంది డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు.

వయసు పెరిగేకొద్దీ దూరదృష్టి లోపించడం వల్ల రోడ్డు ప్రమాదాల ప్రమాదం పెరుగుతుందనే అంశంపై డ్రైవర్లకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఎస్. శోభన్ బాబు, ఏఎంవిఐ ఉదయ్ కుమార్, రవాణా శాఖ సిబ్బంది, అలాగే డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రహదారి భద్రతకు డ్రైవర్ల ఆరోగ్యం కీలకమని, ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

బెగ్లూర్ గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు…

బెగ్లూర్ గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు
*మహాదేవపూర్ అక్టోబర్28 నేటి ధాత్రి **

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం గ్రామంబేగ్లూర్ కంటి పరీక్షలు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి మరియు టిపిసిసి జనరల్ సెక్రెటరీ దుద్దిల్ల శ్రీను బాబు గారి ఆదేశాల మేరకు
బెగుళూరు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్ మరియు ఆదర్శ యూత్ టీం ఆధ్వర్యంలో శరత్ మాక్సిజన్ ఐ హాస్పిటల్ హనుమకొండ వారి డాక్టర్లరూప ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేపించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్. ఆదర్శ యూత్ క్లబ్. అధ్యక్షులు ములకల పోచమల్లు. పోలు మొండి. బుర్రి శివరాజ్.చల్ల తిరుపతి. యూత్ కాంగ్రెస్ నాయకులు. దోమల రాజేష్. మళ్ళా గౌడ్. ములుకల తిరుపతి. ములుకల సతీష్. రాసాకట్ల శ్రావణ్.. మరియు. గ్రామ ప్రజలుకాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

గ్రీన్ స్టార్ హాస్పిటల్ లో ఆప్తమాలజీ యూనిట్ ప్రారంభం….

గ్రీన్ స్టార్ హాస్పిటల్ లో ఆప్తమాలజీ యూనిట్ ప్రారంభం

నర్సంపేట,నేటిధాత్రి:

 

*నర్సంపేట పట్టణంలోని గ్రీన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆప్తమాలజీ కంటి వైద్య యూనిట్ ను ప్రారంభించినట్లు గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.నేటి నుండి స్టార్ హాస్పిటల్ లో కంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని కంటి ఆపరేషన్లు కంటిలో పోరా, లెన్స్ లాంటి ఆపరేషన్లు కూడా చేయబడును అని డయాబెటిక్ పేషెంట్లకు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ విద్య, కంటి వైద్య నిపుణులు నామాల అనిల్, గ్రీన్ స్టార్ హాస్పిటల్ డైరెక్టర్లు బీరం నాగిరెడ్డి, నాయుడు శ్రీనివాస్,అనంతగిరి రవి,గోనె యువరాజు,పీఆర్ఓ రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version