హై టెన్షన్ వైర్ల కింద అక్రమ నిర్మాణం, ప్రమాద సూచన…

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ నిర్మాణదారులు పట్టించుకోని జిహెచ్ఎంసి మరియు రెవెన్యూ అధికారులు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి 

మాదాపూర్ డివిజన్ పరిధిలోని బిక్షపతి నగర్ లో హై టెన్షన్ వైర్ల కింద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారు మరియు ఇది ప్రభుత్వ భూమి అని తెలుస్తుంది ఇంత భారీ ఎత్తున ప్రజల ప్రాణాలతో చెల గాటం ఆడుతున్న అక్రమ నిర్మాణదారుడు కనీసం అటువైపు తొంగి చూడని అధికారులు
హై టెన్షన్ వైర్ల కింద బారి ఎత్తున
నిర్మాణం చేపడుతున్నారు ఇట్టి నిర్మాణానికి పనికొరకు అమాయక కూలీలు తెలియక వస్తున్నారు ఇట్టి హై టెన్షన్ వైర్లకు చాలా ఎలక్ట్రికల్ పవర్ ఉంటుంది దాదాపు 7 8 మీటర్ల దూరం నుండి వాటి ప్రభావం చూపుతుంటాయి అయితే ఇట్టి వైర్ల కిందనే నిర్మాణం చేపడుతున్నారు ఇట్టి నిర్మాణానికి పైన ఉన్న హై టెన్షన్ వైర్లకు దూరం చాలా తక్కువ అసలు హై టెన్షన్ వైర్ల కింద నిర్మాణాలు చేపట్టకూడదు అని నిబంధనలు ఉన్నప్పటికీ ఇట్టి నిర్మాణదారులు ఏలాంటి అనుమతులు తీసుకోకుండా అధికారులను మరియు ఫిర్యాదుదారులను మభ్యపెట్టి భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపడుతున్నాడు కావున అధికారులు పరిశీలించి వెంటనే ఇట్టి అక్రమ నిర్మాణాన్ని తొలగించి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ప్రమాదాన్ని పసిగట్టి ప్రమాదం జరగకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు

విద్యుత్ అత్యవసర పరిస్థి తిలో 1912 కు సంప్రదిం చాలి..

విద్యుత్ అత్యవసర పరిస్థి తిలో 1912 కు సంప్రదిం చాలి

విద్యుత్ ప్రమాదాల సూచ నలు ప్రజలు పాటించాలి

శాయంపేట నేటిధాత్రి:

విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని విద్యుత్ అధికారి చందులాల్ మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల ప్రధాన కారణాలు మరియు జాగ్రత్తలను వివరించారు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పాటించవలసిన జాగ్రత్తలు
తడిచిన చేతులతో విద్యుత్ పరికరాలు తాకరాదు.
వర్షాకాలంలో కరెంట్ స్తంభాలను పట్టుకోరాదు.
•పడిపోయిన విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లరాదు, తాకరాదు.పవర్ లైన్ దగ్గర గాలిపటాలు ఎగరేయరాదు.
కరెంట్ ఉన్న తీగల దగ్గర ఇనుప దండలు వాడరాదు.
వాటర్ హీటర్, చార్జర్ వైర్లను చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచరాదు.నాసిరకం వైర్లు, స్విచ్ బోర్డులు వాడరాదు.
ఇంటి పరికరాలకు ఎర్తింగ్ తప్పనిసరిగా చేయించుకో వాలి.ఛార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడరాదు లేదా ఆటలు ఆడరాదు.చిన్నపిల్లలు స్విచ్ బోర్డుల దగ్గరకు వెళ్లకుండా చూడాలి.విద్యార్థులు రైతులకు చెప్పవలసిన జాగ్రత్తలు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పశువులను మేపరాదు.
పంటచేలకు కరెంట్ ఫెన్సింగ్ వాడరాదు.ఇనుప స్టార్టర్ బాక్సులను వాడరాదు.
కరెంట్ లైన్ల క్రింద నిర్మాణాలు చేయరాదు.ఇంటి దగ్గర కరెంట్ వాడకానికి కోక్కాలు వాడరా దు; సర్వీస్ వైర్‌ను అధికారుల ద్వారా కనెక్ట్ చేయించుకోవాలి.
ట్రాన్స్ఫార్మర్ రిపేర్‌ను రైతులు స్వయంగా చేయరాదు అధికారులు వచ్చే వరకు వేచి ఉండాలి, మోటార్ సర్వీస్ వైర్లు కరెంట్ లైన్‌కు కనెక్ట్ చేసేటపుడు, మూడు వైర్లను ఒకే సమయంలో కలిపి, ఒక మీటర్ దూరంలో ముడివేయా లి విడిగా తగిలించరాదు. ప్రమాదం జరిగినప్పుడు చేయవలసినవి.ప్రమాదంలో ఉన్న మనిషి/జంతువు/వస్తువును నేరుగా తాకరాదు.
పొడి కర్ర, ప్లాస్టిక్ పైప్ లేదా ఇన్సులేటెడ్ వస్తువు ద్వారా మాత్రమే వేరు చేయాలి.
వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలి.
ఎలాంటి విద్యుత్ సమస్య లకైనా టోల్‌ ఫ్రీ నంబర్ 1912 కి సమాచారం ఇవ్వాలి.

యమపాశాలుగా 11 కెవి విద్యుత్ వైర్లు.

యమపాశాలుగా 11 కెవి విద్యుత్ వైర్లు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

11 కె.వి విద్యుత్ వైర్ పంట పొలాలలో యమ పాశాలుగా తయారయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 11 కె.వి విద్యుత్ తీగలు కిందకి వేలాడుతున్నాయి. ఈ సందర్బంగా బాధితుడు మాట్లాడుతూ.. ప్రమాదం ఏ విధంగా సంభవిస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. కింది నుండి చేయి చాచితే చేయికి వైర్లు తగులుతున్నాయన్నారు. ఈ విషయమై విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. దీని పై సంబంధిత అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version