హై టెన్షన్ వైర్ల కింద అక్రమ నిర్మాణం, ప్రమాద సూచన…

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ నిర్మాణదారులు పట్టించుకోని జిహెచ్ఎంసి మరియు రెవెన్యూ అధికారులు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి 

మాదాపూర్ డివిజన్ పరిధిలోని బిక్షపతి నగర్ లో హై టెన్షన్ వైర్ల కింద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారు మరియు ఇది ప్రభుత్వ భూమి అని తెలుస్తుంది ఇంత భారీ ఎత్తున ప్రజల ప్రాణాలతో చెల గాటం ఆడుతున్న అక్రమ నిర్మాణదారుడు కనీసం అటువైపు తొంగి చూడని అధికారులు
హై టెన్షన్ వైర్ల కింద బారి ఎత్తున
నిర్మాణం చేపడుతున్నారు ఇట్టి నిర్మాణానికి పనికొరకు అమాయక కూలీలు తెలియక వస్తున్నారు ఇట్టి హై టెన్షన్ వైర్లకు చాలా ఎలక్ట్రికల్ పవర్ ఉంటుంది దాదాపు 7 8 మీటర్ల దూరం నుండి వాటి ప్రభావం చూపుతుంటాయి అయితే ఇట్టి వైర్ల కిందనే నిర్మాణం చేపడుతున్నారు ఇట్టి నిర్మాణానికి పైన ఉన్న హై టెన్షన్ వైర్లకు దూరం చాలా తక్కువ అసలు హై టెన్షన్ వైర్ల కింద నిర్మాణాలు చేపట్టకూడదు అని నిబంధనలు ఉన్నప్పటికీ ఇట్టి నిర్మాణదారులు ఏలాంటి అనుమతులు తీసుకోకుండా అధికారులను మరియు ఫిర్యాదుదారులను మభ్యపెట్టి భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపడుతున్నాడు కావున అధికారులు పరిశీలించి వెంటనే ఇట్టి అక్రమ నిర్మాణాన్ని తొలగించి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ప్రమాదాన్ని పసిగట్టి ప్రమాదం జరగకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు

అతివేగంతో గ్రామంలో ప్రజలు పిల్లలను భయ ప్రాంతులకు గురిచేస్తున్న ఇసుక ట్రాక్టర్లు…

అతివేగంతో గ్రామంలో ప్రజలు పిల్లలను భయ ప్రాంతులకు గురిచేస్తున్న ఇసుక ట్రాక్టర్లు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.

 

తంగళ్ళపల్లి మండలం మండే పల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా. గ్రామస్తులు ప్రజలు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ప్రభుత్వపరంగా ఇసుక వే బిల్లులు. మండల రెవెన్యూ అధికారుల ప్రభుత్వపరంగా ఇస్తుండగా. వాటికి అనుగుణంగా గ్రామంలో నుంచి వే బిల్లుల ద్వారా ఇసుక సరఫరా జరుగుతుండగా. దానికి సంబంధించి గ్రామంలో నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లు ఇష్టానుసారంగా నడిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ. గ్రామంలో నిర్మితమైన కమానును ఢీ కొట్టుకుంటూ. గ్రామ ఇండ్లల్లో కరెంటు స్తంభాలను ఢీకొట్టుకుంటూ వైర్లు తెగిపోతున్న గ్రామంలో ఇండ్లలో విద్యుత్తు సరఫరా నిలిచిపోతున్న ఇండ్లలో ఏమి. ఏమి నష్టం జరుగుతున్న పట్టించుకోకుండా సదరు ట్రాక్టర్ డ్రైవర్లు గాని యజమానులు గాని ఇష్టానుపురూపంగా వాహనాల నడుపుతున్నారని మొన్నటికి మొన్న ఒక ట్రాక్టర్ ది ముంగటి చక్రం ఊడిపోయి పొలాల్లో పడిపోయిందని. ఇసుక ట్రాక్టర్ నడుపుతున్న చాలామంది మైనర్ పిల్లలు ఉన్నారని వారికి లైసెన్సులు కూడా లేవని గ్రామంలో ప్రజలు వీధులపై తిరగడానికి భయపడుతున్నారని. స్కూలు విద్యార్థులు గ్రామాలలో పిల్లలు పెద్దలు ముసలి వాళ్లు బయటకి రావడానికి భయపడుతున్నారని. దయచేసి వెంటనే సంబంధిత అధికారులు వచ్చి స్థానిక ఎస్సై గారు వచ్చి. గ్రామంలో జరుగుతున్న వాటిపై చర్యలు తీసుకుంటూ. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కేటాయించిన వే బిల్లుల ప్రకారం. నడిపించుకోవాలని. మేము ప్రభుత్వ అందించిన దానికి వ్యతిరేకం కాదు అని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి నష్టం వాటిల్లకుండా నడుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక ఎస్సై. సంబంధిత రెవెన్యూ అధికారులు. రావాలని రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు స్థానిక ఎస్సై గ్రామానికి వచ్చి గ్రామ ప్రజలతో చర్చించి ఇకపై ఇలాంటి సంఘటన పునవృతం కాకుండా. చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు ఇట్టి కార్యక్రమం

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version