యమపాశాలుగా 11 కెవి విద్యుత్ వైర్లు.

యమపాశాలుగా 11 కెవి విద్యుత్ వైర్లు

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

11 కె.వి విద్యుత్ వైర్ పంట పొలాలలో యమ పాశాలుగా తయారయ్యాయి. ఈ మేరకు నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 11 కె.వి విద్యుత్ తీగలు కిందకి వేలాడుతున్నాయి. ఈ సందర్బంగా బాధితుడు మాట్లాడుతూ.. ప్రమాదం ఏ విధంగా సంభవిస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. కింది నుండి చేయి చాచితే చేయికి వైర్లు తగులుతున్నాయన్నారు. ఈ విషయమై విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. దీని పై సంబంధిత అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

జహీరాబాద్: పోరాట ఫలితంగానే.!

జహీరాబాద్: పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాల పెంపు.

జహీరాబాద్ నేటి ధాత్రి

పోరాట ఫలితంగానే అంగన్వాడీల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి బుధవారం ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీల సమస్యలపై మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులను ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దామని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version