గురుకుల్ సెట్‌లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం…

గురుకుల్ సెట్‌లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

35 మందిలో 29 మంది ఫస్ట్ లిస్టులో ఎంపిక

దుగ్గొండి,నేటిధాత్రి:

 

 

 

దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో గల లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు తెలంగాణ గురుకుల్ సెట్ పరీక్షలో విశేష ఫలితాలు సాధించారు. గత నెల ఫిబ్రవరి 22న నిర్వహించిన గురుకుల సెట్ పరీక్షకు పాఠశాలకు చెందిన 4వ తరగతి 35 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 29 మంది ఫస్ట్ లిస్టులో ఎంపిక కావడం విశేషం.
ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరస్పాండెంట్ గట్టి కొప్పుల విజేందర్ విద్యార్థులను అభినందించారు. నిరుపేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తున్న ఏకైక పాఠశాల లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని ఆయన తెలిపారు. గత 17 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పేద పిల్లలకు విద్యా దారి చూపిస్తున్నామని అన్నారు.విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశయాలను, తమకు విద్య నేర్పిన గురువుల ఆశయాలను నిలబెట్టాలని సూచించారు. అలాగే పిల్లల భవిష్యత్తు కోసం లిటిల్ ఫ్లవర్ యాజమాన్యం ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటుందని తెలిపారు.ఈ విజయానికి పాఠశాల ఉపాధ్యాయులు జి. అనిత, జి. రాధిక, ఎన్. సుప్రజా, ఎస్. విష్ణు, బి. సుధాకర్, డి. జీవన్, మను కృష్ణలు విశేషంగా కృషి చేశారని తెలుపుతూ వారిని అభినందించారు.

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం…

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రంజోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపిన వివరాల ప్రకారం, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 20. పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాల కోసం www.tspolycet.nic.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.

గణిత ప్రతిభ పాట పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక.

గణిత ప్రతిభ పాట పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక.

జిల్లా స్థాయిలో మొదటి స్థానం లో గెలుపొందిన షేక్ షిఫా తహసీన్ .
మంగపేట నేటిధాత్రి

 

గణిత ప్రతిభాపాటవా పోటీ పరీక్షల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానం గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపిక మంగపేట మండలంలోని జడ్పీహెచ్ఎస్ మంగపేట హై స్కూల్ కి చెందిన టెన్త్ క్లాస్ తెలుగు మీడియం షేక్ షిఫా తహసీన్ జిల్లా స్థాయిలో జరిగిన తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం వాళ్లు నిర్వహించిన గణిత ప్రతిభ పాట పోటీల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానాన్ని గెలుపొందినందుకు స్థానిక మండల విద్యాశాఖ అధికారిని పొడెం మేనక అభినందించారు మరియు మంగపేట హైస్కూల్ ఉపాధ్యాయులు క్రాంతి నాగేందర్ మధురిమ చంద్రశేఖర్ తదితర ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు రాష్ట్ర స్థాయిలో కూడా గెలుపొంది పాఠశాలకు మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎంఈఓ తెలియజేసినారు

తెలంగాణ ఒలంపియాడ్‌లో జడ్ పిహెచ్ఎస్ బాలికల మెరిసిన ప్రతిభ

ప్రతిభ కనబరిచిన జడ్ పిహెచ్ఎస్ బాలికలు

శుభాకాంక్షలు తెలిపిన ఉపాధ్యాయులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో ఆంగ్ల భాష ఉపాధ్యాయులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి తెలంగాణ ఒలంపియాడ్ పరీక్షలో శాయంపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠ శాల పదవ తరగతి చదువు తున్న దీవెన మొదటి బహు మతి సాధించి, ఎడ్యుక్వాస్ట్ సీనియర్ విభాగంలో ఎండి రేష్మ మొదటి బహుమతి సాధించగా,జూనియర్ విభాగంలో రుక్మిణి ప్రథమ బహుమతి సాధించింది. నాలుగు బహుమతులకు గాను మూడు బహుమతులు పాఠశాల విద్యార్థులు సాధిం చారు. ఈ విద్యార్థులు జిల్లా స్థాయికి అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు శేఖర్ బాబుకు, బహుమతులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు శ్రీలత శుభాకాంక్షలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version