ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం,
జహీరాబాద్ నేటి ధాత్రి:
రంజోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపిన వివరాల ప్రకారం, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 20. పాలిసెట్ ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాల కోసం www.tspolycet.nic.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
