ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

 

 

ఇంట్లోని టీవీ వెనుక కప్‌బోర్డులో 80 గ్రాముల బంగారు నగలు ఉంచారు. 20వ తేదీ చూస్తే ఉన్నాయి. శుక్రవారం ఉదయం చూస్తే లేవు. 20వ తేదీన మధ్యాహ్నం షాపునకు వెళ్లొచ్చిన అరగంట వ్యవధిలోనే దొంగతనం చేసుంటారని భావించారు.

ఇంట్లోని టీవీ వెనుక కప్‌బోర్డులో 80 గ్రాముల బంగారు నగలు ఉంచారు. 20వ తేదీ చూస్తే ఉన్నాయి. శుక్రవారం ఉదయం చూస్తే లేవు. 20వ తేదీన మధ్యాహ్నం షాపునకు వెళ్లొచ్చిన అరగంట వ్యవధిలోనే దొంగతనం చేసుంటారని భావించారు. దీనిపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్‌ సీఐ చిన్నగోవిందు(Tirupati Rural CI Chinnagovindu) కథనం మేరకు.. దుర్గసముద్రంలో పత్తి మునెమ్మ, రామచంద్రయ్య దంపతులు ఉంటున్నారు.

ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటలకు రామచంద్రయ్య తన అక్క ఇంటికి వెళ్లారు. 3.30 గంటల సమయంలో మునెమ్మ ఆకు వక్క తీసుకురావడానికి ఇంటికి తాళమేసి, తలుపు పక్కన బ్యాగులో ఆ తాళాలు ఉంచి వెళ్లారు. అరగంట తర్వాత ఆమె తిరిగొచ్చారు. తలుపునకు తాళం వేసుండటంతో ఎలాంటి అనుమానం రాలేదు. శుక్రవారం ఉదయం చూడగా టీవీ వెనుక ఉంచిన దాదాపు 80 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు.

ఇళ్లంతా వెదికారు. ఎక్కడా కనిపించక పోవడంతో శనివారం రూరల్‌ సీఐ చిన్నగోవిందును కలసి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ షేక్‌షావలి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్‌, సీఐ చిన్నగోవిందు, ఎస్‌ఐ షేక్‌ షావలి, పోలీసులు, డాగ్‌, వేలి ముద్రలు నిపుణులు పరిశీలించారు. ఇప్పటికే అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులకు కేసులో కొన్ని ఆధారాలు లభించినట్లు తెలిసింది.

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.డీఎస్పీ ప్రసాద్

పాకాల(నేటిధాత్రి) ఫిబ్రవరి 10:

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీలో చంద్రగిరి డి.ఎస్.పి బి.ప్రసాద్ ఆధ్వర్యంలో కార్మికులతో పరిసరాలను పరిశుభ్రం పాకాల సి.ఐ సుదర్శన్ ప్రసాద్ సోమవారం చేపించారు.కార్యక్రమం దామలచెరువు పంచాయతీ కార్యదర్శి వి.మహేశ్వరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రగిరి డిఎస్పి బి.ప్రసాద్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కొంతమంది ఆకతాయిలు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆకతాయిలు బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రదేశాలను పరిశీలించి శుభ్రం చేపించామని పేర్కొన్నారు.సమీప ప్రదేశంలో పంచాయతీ సిబ్బందితో కలిసి కంప చెట్లను,ముండ్ల పొదలను శుభ్రం చేసి అక్కడ పెక్సీలను ఏర్పాటు చేసి హెచ్చరికలను జారీ చేశామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ వెంకటరమణ నాయుడు,అర్జున్,మహర్షి,శీను,పోలీస్ సిబ్బంది,పంచాయతీ సిబ్బంది,స్థానిక నేతలు లతీఫ్,భాష,పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version