తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

*తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని సత్కరించిన..

*ఎర్రరెడ్డి పాళ్యం గ్రామ ప్రజలు…

తిరుపతి నేటి ధాత్రి

తుడా చైర్మన్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి ని, రేణిగుంట మండలం,ఎర్రరెడ్డి పాళ్యం గ్రామనికి చెందిన నాయకులు భాస్కర్ యాదవ్, కృష్ణ, మోహన్, గోపి,శివ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు డాలర్స్ దివాకర్ రెడ్డి ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారుతుడా నిధులతో తమ గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని తుడా చైర్మన్ కి వినతిపత్రం అందజేశారు. తప్పకుండా తుడా నిధులు వెచ్చించి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా శ్రేయోభిలాషి దివాకర్ రెడ్డి తుడా ఛైర్మెన్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన దివాకర్ రెడ్డి హయాంలో తిరుపతి నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version