దిడిగి గ్రామంలో ఘనంగా గృహజ్యోతి కార్యక్రమం

ఘనంగా గృహజ్యోతి కార్యక్రమం దిడిగి గ్రామంలో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని దిడిగి గ్రామంలో
సర్పంచ్ జగదాంబ సోమప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ గృహజ్యోతి వంటి పథకాలు మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప మాట్లాడుతూ దిడిగి గ్రామంలో మహిళల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామ మహిళలు స్వావలంబన సాధించే దిశగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

దిడిగి గ్రామంలో గ్రామ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.

దిడిగి గ్రామంలో గ్రామ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.

◆-: గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీమతి జగదాంబ సోమప్ప

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గ్రామానికి టర్నింగ్ అయ్యే రెండు ప్రధాన పాయింట్ల వద్ద రోడ్డు పక్కల పొదలను జెసిబి సహాయంతో పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్దారు. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు స్పష్టమైన దారి కనిపిస్తూ ప్రమాదాల అవకాశాలు తగ్గాయి. అంతేకాకుండా గ్రామానికి గుర్తింపుగా గ్రామ ఊరు పేరు బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప ఆధ్వర్యంలో, ఉపసర్పంచ్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సౌందర్యం పెరగడంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చేపట్టిన ఈ చర్యలపై గ్రామస్తులు సర్పంచ్‌కు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల సర్పంచ్ జగదాంబ సోమప్ప చూపుతున్న చొరవకు ఇది నిదర్శనమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గ్రామ సర్పంచ్ తెలిపారు.

డిడిఎస్ ఆధ్వర్యంలో దిడిగిగ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప…

డిడిఎస్ ఆధ్వర్యంలో దిడిగిగ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

డిడిఎస్ సంఘం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా డిడిఎస్ సంఘం చేపడుతున్న ఆర్గానిక్ వ్యవసాయ విధానాల ప్రాధాన్యతను నాయకులు వివరించారు. డిడిఎస్ సంఘం ద్వారా ఉత్పత్తి అవుతున్న ఆర్గానిక్ పప్పులు, ధాన్యాలు, బియ్యం వంటి ఆహార పదార్థాలు ప్రపంచంలోనే అరుదైన, విలువైన వ్యవస్థకు నిదర్శనమని వారు
పేర్కొన్నారు. ఇలాంటి ఆర్గానిక్ వ్యవస్థలు విస్తృతంగా కొనసాగితే ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ನೆಟಿ పరిస్థితుల్లో భూమిలో సారవంతం తగ్గిపోవడం, పాడి పశువుల సంఖ్య తగ్గడం వల్ల సహజ ఆహారాలు కొరతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతింటోందని, దీనికి ప్రత్యామ్నాయంగా డిడిఎస్ లాంటి సంస్థలు ప్రోత్సహిస్తున్న ఆర్గానిక్ సాగు విధానాలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు, రైతులు కలిసి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిడిఎస్ సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆర్గానిక్ వ్యవసాయ ప్రాముఖ్యతపై చర్చించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version