◆ సందర్భంగా పాత్రికేయ సోదర సోదరీమణులందరికీ శుభాభినందనలు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ
జహీరాబాద్ నేటి ధాత్రి:
‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ సందర్భంగా జహీరాబాద్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ సోదర, సోదరీమణులందరికీ శుభాభినందనలు తెలియజేశారు. “పత్రికా స్వేచ్చ ప్రజాస్వామ్యానికి ఒక మూలస్తంభం. సత్యాన్ని వెలికి తీసే కర్తవ్య నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాత్రికేయులు చూపే నిబద్ధత, ధైర్యం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. సమాజంలో వారి సేవ అమూల్యం” అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం.. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించటం మీడియా కర్తవ్యం.. నిష్పక్షపాతంగా వృత్తి నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులకు వందనం..ఒక సందేశంలో పేర్కొన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని ఐఎన్టియుసి కార్యాలయంలో ఐఎన్టియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంఘం సభ్యులు జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. కనీస వేతనాల బోర్డు చైర్మన్, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజావత్ రాంబాబు, ఐఎన్టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘ బుచ్చయ్య, ఏరియా సెక్రెటరీ బత్తుల వేణు, సిహెచ్పి ఫిట్ సెక్రటరీ రాములు, సివిల్ ఫిట్ సెక్రటరీ గుర్రం శ్రీనివాస్, కాసర్ల ప్రకాష్ ఐ ఎన్ టి యు సి నాయకులు పాల్గొన్నారు.
సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా మేడే నిర్వహన.
ప్రపంచ కార్మికులారా ఏకంకండి 139 వ మేడే పిలుపు.
కారేపల్లి నేటి ధాత్రి.
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 139 వ మే డే సందర్భంగా సింగరేణి మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఘనంగా మేడే జెండాలను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సినియర్ మండల నాయకులు తాతా వేంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 86 లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో వేలాదిమంది కార్మికులు 8 గంటల పని దినాలు ఉద్యోగ భద్రతకై పెట్టుబడిదారీ వర్గం మీద తిరుగుబాటు చేసి ఆరుగురు కార్మికులు అమరత్వం పొంది ఏడుగురు ఉరిశిక్షలకు గురి అయ్యి ఫాసిస్టు పోలీస్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో వేలాదిమంది గాయాలపాలై చరిత్రకెక్కిన సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక వర్గ దినోత్సవం గా మేడేను ప్రకటించింది నాటి అమరత్వం పోరాటాల సందర్భంగా భారత కార్మిక వర్గం 8 గంటల పరిధినాలను ఉద్యోగ భద్రతను హక్కులను చట్టాలను కార్మిక వర్గం పొందినది ఎన్నో త్యాగాలతో సాధించుకున్న వివిధ కార్మిక రైతాంగ చట్టాలను మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం 44 కోడులుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి 8 గంటల పని దినాలను మార్చి 12 గంటల పని దినాల అమలుకు పూనుకున్నది దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు బహుళజాతి కంపెనీలకు భూములతో సహా ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టింది నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తుందని కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు గతంలో సాధించుకున్న వన్ ఆఫ్ సెవెంటీ వీసా 2006 అటవీ హక్కుల చట్టాలను అమలు చేయకపోగా 2022 నూతన అటవీ సంరక్షణ నియమావళి చట్టాన్ని తీసుకువచ్చి పై వాటి రద్దుకు పూనుకుంది ఢిల్లీ రైతాంగానికి ఇచ్చిన హామీలను మూడు నల్ల చట్టాలను నాలుగు లేబర్ కోడలు రద్దు చేస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తిరిగి వాటి అమలుకు పూనుకున్నది దేశంలో రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ కవులు కళాకారులు అభ్యుదయవాదులపై ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ పై దాడులకు హత్యలకు పూనుకొని ప్రశ్నించే గొంతులను నొక్కువేస్తుంది ఆపరేషన్ కగార్ పేరుతో మద్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో 20 లక్షల లక్షల పోలీస్ బలగాలను దింపి వందలాదిమంది అమాయక ఆదివాసి గిరిజన పేద ప్రజలపై గ్రామాలపై దాడులు హత్యాకాండను నిర్బంధాలను కొనసాగిస్తున్నది నక్సలిజం 2006 వరకు నిర్మూలన పేరుతో అమిత్ షా మోడీ 500 మంది అమాయకులను ఆదివాసులను బలి తీసుకున్నది ఎన్కౌంటర్లను కొనసాగిస్తున్న వీటన్నిటికీ వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఈ చర్యలను ఖండించి ఐక్యమై సాధించుకున్న హక్కులకై మేడే స్ఫూర్తితో ముందు బాగాన నిలబడి పోరాటాలలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సినియర్ నాయకులు తాతా వేంకటేశ్వర్లు ఉంగరాల సుధాకర్ పాటి అనంత రామయ్య పుచ్చకాయల శ్రీను మాంగు హర్సింగ్ నాగళ్ళ చంద్రం లచ్చయ్య తనకేం విజయ్ తనకేం చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ( ఐ ఎన్ టి సి 327) ఘనంగా మేడే వేడుకలు
తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి
ఈరోజు తొర్రూరు డివిజన్లో ఐ ఎన్ టి సి 327 సంఘం ఆధ్వర్యంలో మే డేను ఘనంగా నిర్వహించారు. తొర్రూర్ డివిజన్ అధ్యక్షుడు కే భోజలు జెండా ఆవిష్కరించి శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు. కార్మికుల హక్కులను సాధించే దిశగా సంఘటితం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. ఇకార్యక్రమంలో మహబూబాబాద్ సర్కిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ పాషా, మరియు జిల్లా నాయకులు పసుపులేటి మధు తొర్రూరు డివిజన్ కార్యదర్శి డి సికిందర్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి నాగరాజు, డీసెంట్ ట్రెజరర్ కే రవికుమార్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పి రాజశేఖర్, డివిజన్ ఆఫీస్ సెక్రటరీ పి సునీల్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చించు సంతోష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, మాజీ ఎంపీపీ శ్యాంసుందర్ గారు, ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి గారు మరియు తొర్రూర్ డివిజన్ కార్మికులు డోలు వెంకటస్వామి, సైదులు, యాకుబ్ రెడ్డి, లింగారెడ్డి, సతీష్ ,హరిప్రసాద్, ఖాజాబీ, సంధ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి చెరిపెల్లి అశోక్ మహర్షి (ఎస్6 న్యూస్ ) మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను వెలికితీస్తున్న క్రమంలో ప్రభుత్వాల కుట్రలకు బలైపోయిన కలం కార్మికులకు నివాళులర్పిస్తూ కలం కార్మికుల స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. జర్నలిస్టు యోధులు షేక్ బందగీ, ఎన్ కౌంటర్ దశరథ రామ్, గౌరీ లంకేష్, ల ఆశయాలను కొనసాగించాలని కోరారు. కలం కార్మికుల హక్కుల కోసం సమిష్టిగా ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బండిపెల్లి మధు (జర్నలిస్టు సూర్య), ప్రెస్ క్లబ్ కోశాధికారి కొత్తకొండ వాసు (బెస్ట్ వాయిస్ రిపోర్టర్), కార్యవర్గ సభ్యులు కమ్మగాని నాగన్న (పయనించే సూర్యుడు), గజ్జి సంతోష్ కుమార్ ( నేటి దిన పత్రిక సూర్య ), వన్నాల ధనుంజయ (నేటిధాత్రి), అబ్బోజు యాక స్వామి (ఐ న్యూస్), సీనియర్ జర్నలిస్ట్ చిట్యాల మధు (నమస్తే తెలంగాణ) పాల్గొన్నారు.
కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏఐటియూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసర అశోక్ జెండా జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగల శంకర్,శ్రీపతి కుమారస్వామి,కోట యాదగిరి,మోర రవి,దొగ్గేలా బాబు,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి పల్లె గ్రామంలో జండా విష్కరణ
కామారెడ్డిపల్లి గ్రామంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీపతి రాజు జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో కొయ్యడా శంకర్,తిక్క శ్రీనివాస్,అలాగే గౌరవ అధ్యక్షులు తిక్క రమేష్ బాబు,ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీపతి ఐలయ్య,అమాలి కార్మిక సభ్యులు మేకల రాజయ్య,కొయ్యడ రాజయ్య,కొయ్యడ చిన్న భద్రయ్య,కొయ్యడ శంకర్రావు,కొయ్యడా శోభన్,మామిడి జగన్,రేణిగుంట్ల రాజయ్య,రేణిగుంట్ల రాజు,నాగేల్లి శంకర్,తిక్క కుమారస్వామి,సప్పిడి సాంబయ్య,కొడపాక చిరంజీవి,అనుమకొండ సదయ్య తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలో 139వ మే డే వేడుకలు ఘనంగా జరిగాయి.చారిత్రాత్మక మేడే ఆవిర్భావ నేపథ్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకుని వారి త్యాగాలకు పలువురు కార్మిక సంఘ నాయకులు, రాజకీయ నాయకులు ఘన నివాళులర్పించారు. సిపిఐ కార్యాలయం ఆవరణలో అక్బర్ ఆలీ, సిహెచ్పి సమీపంలో ఏఐటియుసి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో తేజావత్ రాంబాబు, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, సీఐటియు కార్యాలయం ఆవరణలో పార్టీ నాయకులు సాంబారి వెంకటస్వామి, రామగిరి రామస్వామి, రజక సంఘం కార్యాలయం ఆవరణలో అధ్యక్షుడు నడిగోట తిరుపతి , సింగరేణి సివిల్ కార్యాలయం సమీపం లో ఐఎన్టీయుసి నాయకులు సంగ బుచ్చయ్య, శ్రీనివాస్ గౌడ్, మేకల రాజయ్య,కాంగ్రెస్ నాయకులు యాకుబ్ ఆలీ, తాపీ మేస్త్రి సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు జిలకర రాయమల్లు లు జెండాలు ఎగరవేసి మే డే దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా నస్పూర్ ఏరియాలోని ఐఎన్టీయూసీ బ్రాంచ్ కార్యాలయంలో 139వ మే డే దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించి, వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గురువారం ఏరియా వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్రావు మాట్లాడుతూ…కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేవని కీర్తించారు.ఇది సాధారణమైన రోజు కాదని,శ్రమించే ప్రతి గుండె చప్పుడు,పోరాడే ప్రతి ఆత్మ యొక్క గర్జన,తరతరాల కార్మికుల కలలు,ఆకాంక్షలు, అలుపెరగని పోరాటాల సజీవ సాక్ష్యమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గరిగ స్వామి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కలవేన శ్యామ్,సెంటర్ సెక్రెటరీ లేగల శ్రీనివాస్,డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పేరం రమేష్,జీవన్ జోయల్,భీమ్ రవి,మెండే వెంకట్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సంఘటిత అసంఘటిత కార్మికుల అందరూ మే డేను జరుపుకు న్నారు.వివిధ రంగాలకు చెందిన కార్మికులతో వివిధ యూనియన్ల ఆధ్వ ర్యంలో గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జెండాలను ఎగురవేసి, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపు కున్నారు చేనేత సహకార సంఘంలోని కార్మికులు, ఎంసిపిఐ యూనియన్ల కార్మి కులు, గ్రామపంచాయతీ కార్మికులు, పలు సంఘాల కార్మికులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికులు తన చెమటను చుక్కలను రక్త మాంసాలను కలిగించి పనిచేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగ కార్మిక దినోత్సవం మేడే కార్మికుల ఐక్యత పోరాటాలను నిదర్శనంగా నిలుస్తూ మేడేను అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ శాయంపేట గ్రామ అధ్యక్షుడు నాలికే రాజమౌళి, సూర్య ప్రకాష్, సునీల్ ,అనిల్ కొమురయ్య, చింతల భాస్కర్ ఉస్మాన్ ,నాగలగాని వీరన్న, గాదే కుమారస్వామి రమేష్ వంగరి సాంబయ్య, అన్ని యూనియన్ సంఘాల కార్మికులు, హమాలి కార్మి కులు, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యం లోమే డే సందర్భంగా కార్మికు లకు పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మండల అధ్యక్షుడు మాట్లాడుతూ కార్మికుడు తన చెమట చుక్కలను రక్త మాం సాలను కలిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపు కునే పండుగ కార్మిక దినోత్స వం మేడే కార్మికుల ఐక్యత పోరాటాలను నిదర్శనంగా నిలుస్తూ మే డేను అంతర్జా తీయ కార్మిక దినోత్సవంగా అని కూడా పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు 300 రూపాయల పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మరియు రోడ్డు పక్కన నివసించే గుడారాల మధ్య జీవనోపాధిగా జీవనం కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయా లన్నారు.ఈ కార్యక్రమంలో మారపేల్లి రవీందర్, దుబాసి కృష్ణమూర్తి, చిందం రవి, మార్కండేయ , కట్టయ్య , శాంత-రవి, రఫీ , ప్రపంచ రెడ్డి, నాగలగాని వీరన్న, రాజేందర్, రాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.
మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ పోరాటాలను బలోపేతం చేద్దాం
టియుసిఐ నేత కొమరం శాంతయ్య
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
టియుసిఐ గుండాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గురువారం మే డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంధా) కార్యాలయం వద్ద టియుసిఐ జెండాను ఆ సంఘం గుండాల ఏరియా కమిటీ కార్యదర్శి కొమరం శాంతయ్య ఆవిష్కరించారు. జవ్వాజి సెంటర్ లో టియుసిఐ గుండాల ఏరియా కమిటీ అధ్యక్షులు గడ్డం రమేష్ ఆవిష్కరించారు. పెట్రోల్ బంకు వద్ద టియుసిఐ ఏరియా కమిటీ సభ్యులు వసంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో టియుసిఐ ఏరియా కమిటీ కార్యదర్శి కొమరం శాంతయ్య, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంధా) జిల్లా నాయకులు ఈసం శంకర్, వాంకుడోత్ అజయ్ లు మాట్లాడుతూ కార్మికులు చికాగో నగరంలో 1986 మే 1న పాలకవర్గాల దమన కాండలో తమ రక్తాన్ని చిందించి, ఉరికొయ్యాలని సైతం లెక్కచేయకుండా పోరాడిన పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినాన్ని ప్రపంచమంతా ఆమోదించిందని వారన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కుల్ని కాలరాస్తుందని, కార్మిక వర్గం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ ,మిగతా 29 చట్టాలను నాలుగు లేబర్ కోడులను ఆమోదించి అమలు చేయడం వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారని అన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాంత్రీకరణ పేరుతో ఎనిమిది గంటల పనిని పెంచుతూ 12 గంటలు పనిచేయిస్తూ కార్మికుల రక్తాన్ని మరింత పీల్చి పిప్పి చేస్తున్నారని వారన్నారు. భారత రాజ్యాంగం, కోర్టుల గురించి గొప్పలు వల్లించే పాలకులు సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. శ్రామిక వర్గం జీవించడానికి సరిపడే వేతనాలు ఇచ్చేంతవరకు కార్మిక లోకం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం కార్పోరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అప్పగించడం హేయమైన చర్యాగా వారు పేర్కొన్నారు. కార్మిక లోకం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ,కార్మికుల రెగ్యులరైజేషన్ ,సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగ భద్రతకై జీవించడానికి సరిపడే వేతనాలు ,పెన్షన్ పెంపు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలు నిలుపుదల కోసం 139వ మే డే స్ఫూర్తితో పోరాటాలను ఉదృతం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ ఏరియా కమిటీ నాయకులు మొక్క నరి, కోడూరి జగన్, మాచర్ల కోటి సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకులు పూనెం మంగయ్య, తెల్లం రాజు , పూనెం లక్ష్మయ్య ,ఈసం కృష్ణ , వూకే శ్రావణ్, ధరావత్ వాగ్య, కల్తి వెంకన్న, సనప కిషెంధర్, మోకాల పాపయ్య, ధరావత్ ఆల్యా ,ధరావత్ మోహన్, ఉప్పు రాజ్ కుమార్, ఉప్పు వెంకటేశ్వర్లు, జాటోత్ భాను , ఎస్ కే వసీం, నునావత్ శంకర్, ఉప్పు మహేష్ ,గంగాధరి కార్తీక్, నాగెల్లి తరుణ్ ,వాగబోయిన జగ్గారావు, ఎస్కె కర్ముళ్లా, ఎస్కె బిల్లా తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కోహిర్ మండల్ బిలాల్ పూర్ గ్రామ ప్రాథమిక వైద్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించి డాక్టర్ బి నరేందర్ మాట్లాడుతూ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, ప్రాణాంతక వ్యాధిని నివారించడానికి ఒక ప్రయత్నం.ప్రతి సంవత్సరం 25 న ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.ఈ ప్రపంచ ఆరోగ్య సవాలును పరిష్కరించడంలో, నిర్మూలించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా అనేది నివారించదగిన వ్యాధి.ఇది చికిత్సతో నిర్ములించుకోవచ్చు. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, జీవితాలను ప్రభావితంప్రకారం చేసే సమస్య. కనుక దీనిని నివారించడానికి సరైన దిశలో చర్యలు తీసుకోవాలన్నారు.ఇటి కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ సోనీ, ల్యాబ్ టెక్నీషియన్ జె వాసంత్రావు యమ్ పి హెచ్ ఏ నిరంజన్, సూపర్ వైసర్ శోభారాణి ఆశ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో ఈరోజు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 6వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది
కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది
పంపిణీ అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ మరియు ఉపాధ్యాయులు సుద్దాల ప్రభుదేవా మాట్లాడుతూ… ఈరోజుల్లో యువత చెడు మార్గంలో వెళుతున్న తరుణంలో ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక కొత్త మార్గం ఎంచుకోవాలని వారిని కోరడం జరిగింది
5 సంవత్సరాలుగా మాకు సహకరించి మా కోసం ముందుండి నడిపిన ప్రతి ఒక్క మా మిత్రులకు అన్నలకు, తమ్ముళ్లకు కుటుంబ సభ్యులకు మరియు పట్టణ ప్రజలందరికీ మా తరఫున పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మొదలుపెట్టి సరిగ్గా ఈరోజుకు 6 సంవత్సరాలు పూర్తయింది
ఈ సంస్థ నేను స్థాపించినప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తులతో మొదలై ఈరోజు కొన్ని వందల మందితో ముందుకు వెళుతుంది
మా ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలు ఏమిటంటే కొన్ని మీకోసం తెలియజేయడానికి
1. కరోనా వచ్చి మృతి చెందిన వారికి దహన సంస్కరణాలు చేయడం జరిగింది
2. కరోనా వచ్చినవారికి మా సొంతంగా పౌష్టిక ఆహారం మేమే స్వయంగా వారి వద్దకు వెళ్లి వారికి ఇవ్వడం జరిగింది
3. లాక్ డౌన్ సమయంలో వందల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు మేము వారి వద్దకు వెళ్లి అందించడం జరిగింది
4.పాఠశాల పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు బుక్స్ అందించడం జరిగింది
5.ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది
6. పట్టణ రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారిన సమయంలో రోడ్లపై స్వయంగా మేమే మరమత్తులు చేయడం జరిగింది
7. వాహనదారులకు రోడ్డు మార్గంలో చెట్లు చాలా వేపుగా పెరిగి రోడ్డు సరిగ్గా కనబడక చాలా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో మా సొసైటీ సభ్యులంతా కలిసి ఆ చెట్లను తీసివేయడం జరిగింది
8. నిరుపేద కుటుంబంలోని అమ్మాయిల వివాహాలకు మా వంతుగా ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది చాలా సందర్భాలలో
9.వికలాంగులకు స్టాండ్స్ పంపిణీ చేయడం జరిగింది
10.కరోనా సమయంలో పెరిగిన ఆటో చార్జీలను మా వంతుగా కృషి చేసి తగ్గించడం జరిగింది ఆరోగ్యం బాగా లేక ఇబ్బంది పడుతున్న వారికి మా వంతుగా మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది
11.మందమర్రి చుట్టుపక్కల రాత్రివేళ మహిళలకు ఇబ్బందికరంగా మారిన మార్కెట్ల లైట్ల కోసం సమస్యపై కృషి చేయడం జరిగింది
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి చేయడం జరిగింది
ఇన్ని కార్యక్రమాలు చేయడానికి సహకరించిన నాతోటి మిత్రులకు అధికారులకు ఇతర పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు
ఇంకా మీ సపోర్ట్ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మీ ముందుకు తీసుకు వస్తాం
రాబోయే రోజుల్లో ఈ వందల సంఖ్య కాస్త వేల సంఖ్యగా మారి వేల నుంచి లక్షల సంఖ్యలుగా మారాలని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మా వంతుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నంది పాట రాజ్ కుమార్ జిల్లా కార్యదర్శి గాండ్ల సంజీవ్ మండల అధ్యక్షుడు సకినాల శంకర్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఓరం కవిరాజ్, దాడి రాజు అబిద్ కిరణ్ చరణ్ చింటూ అజయ్ సుందర్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది
మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల- ఫిల్టర్ బెడ్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్ ల ప్రధానోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి ఎంఈఓ దత్తుమూర్తి ,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పద్మజ హాజరై ఉత్తీర్ణత సర్టిఫికెట్ లు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన జ్ఞాన నిర్మాణం కోసం ఉపాద్యాయులు ఎంతో కృషీ చేస్తున్నారని అన్నారు. వినూత్న రీతుల్లో విద్యాబోధన చేస్తూ ఉపాద్యాయులు విద్యార్థులకు సేవలను అందిస్తున్నారని అభినందించారు. పాఠశాల ప్రత్యేకతలు,అడ్మిషన్ ల ప్రారంభం తెలియజేసే కరపత్రాలను విడుదల చేశారు.
Education
ప్రతిభ కనబరిచిన విద్యార్థిని,విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.తల్లితండ్రులు పెద్దఎత్తున హాజరై ఆద్యంతం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి , విద్యార్ధుల ప్రతిభను అభినందించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసాచారి,ఉపాద్యాయులు జనగామ ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్ జలంపెల్లి, చింతకింది లలిత, గుడివెనుక రవి, అమ్మ ఆదర్శం పాఠశాల పాఠశాల చైర్మన్ దూలం అంజలి, పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గ్యాస్ గోదాంలో ప్రమాద నివారణ చర్యల గురించి వివరించిన ఫైర్ సిబ్బంది
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ పరిధిలోని ఆర్ఆర్ ఇండియన్ గ్యాస్ గోదాంలో శుక్రవారం ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్యరంలో 6వ రోజు వారోత్సవాలు నిర్వహించారు.గ్యాస్ గోదాం వద్ద మేనేజర్,సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణకు తగు చర్యల గురించి అవగాహన కల్పించారు.అందులో భాగంగా ఫైర్ ఎక్సటింగుషర్స్ ఏర్పాటు చేసుకోవాలని,నిర్దేశించిన సమయంలో వాటిని రిఫిల్ చేసుకోవాలని మరియు ఎలా ఉపయోగించాలి అని అవగాహన కల్పించారు.వాటర్ హైడ్రెన్డ్స్, స్పింక్లార్ల్ను ఏర్పాటు చేసుకోవాలని,రేడియం ఎగ్జిట్ సూచికలు అత్యవసర సమయంలో అందరికి కనిపించే విధంగా ఉంచాలని అతి ఉష్టాన్ని వెలువరిచే విదుత్ దీపాలను నియమించి, హలొజెన్ దీపాలను వాడవలని తెలిపారు.అత్యవసర సమయాలలో గోదాము సిబ్బందికి,సెక్యూరిటీకి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పరకాల అగ్నిమాపక శాఖ కార్యాలయ సిబ్బంది ఎల్ఎఫ్.చారి,డ్రైవర్ గణేష్,అగ్ని మాపకులు అజయ్ కుమార్,రాజేంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు.
పట్టణంలోని లలితా నర్సింగ్ హోంలో బుధవారం రోజున ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో 3వరోజు వారోత్సవాలు నిర్వహించారు.హాస్పటల్ సిబ్బంది,డాక్టర్లు,చిత్స నిమిత్తం వచ్చిన వారికి అగ్ని ప్రమాదాల నివారణకు తగుచర్యల గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా అధికారి భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని హాస్పిటల్ యాజమాన్యం అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మెలుకువలు సిబ్బందికి తెలిపారు.కరపత్రాలను హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేశారు.ప్రమాదాలను నివారించెందుకు హాస్పటల్ లో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో చారి,డ్రైవర్ సురేష్ ,శ్రీకాంత్,అజయ్ కుమార్,రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు.
బస్టాండ్ లో ప్రజలకు అవగాహన కోసం ఫైర్ డెమో ప్రదర్శన
ప్రజలు,వ్యాపారస్థులు అప్రమత్తంగా ఉండాలి
ఫైర్ అధికారి వక్కల భద్రయ్య
పరకాల నేటిధాత్రి
పరకాల బస్టాండ్ లో మంగళవారం ఫైర్ అధికారి వక్కల భద్రయ్య అధ్వర్యంలో 2వరోజు వారోత్సవాలు నిర్వహించారు.పట్టణ కేంద్రంలోని బస్టాండ్ లో ప్రయానికులకు,స్థానికులకు అవగాహన కల్పించేందుకు ఫైర్ డెమో ప్రదర్మించారు.ఈ సందర్బంగా భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని వ్యాపారస్తులు అగ్నిప్రమాదం సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై కరపత్రాలు పంపణీ చేశారు.బస్టాండ్ ఆవరణలోని పలుచోట్ల వారోత్సవాల పోస్టర్ ఏర్పాటు చేశారు.అగ్నిపమాదం నివారించేందుకు పాటించాల్సిన జాగత్త చర్యలపై అవగాహగా లేక నిర్లక్ష కారణాల వల్లే అగ్నిప్రమాదాలు సంభవిస్తాయన్నారు.అగ్ని ప్రమాదం జరిగితే అపుడు మనదేశ సంపదను కోల్పోయిన వారిగా మిగిలిపోతామున్నారు.ఇప్పటికైనా వ్యాపారాస్తులు అగ్నిమాపక సిబ్బండి సూచనలు పాటిస్తూ,తమ అస్తులను పరిరక్షించుకోవాలన్నారు.వ్యాపారస్థులు ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సన అవసరం ఉందని గుర్తుచేశారు.వారి వెంట పరకాల అగ్నిమాపకశాఖ కార్యాలయం సిబ్బంది ఎల్ఎఫ్ కృష్ణకుమార్, డ్రైవర్ సత్తయ్య, అన్నిమాపకులు సత్యం,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డా” భూక్య మురళి నాయక్, డి సి సి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి
పిల్లలని దయచేసి బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉంచండి…
సెల్ ఫోన్ లకు పిల్లలని దూరంగా ఉంచండి
విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రమశిక్షణ పాటిస్తూ భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ఆకాంక్షించారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఐ ఎన్ టి ఎస్ ఓ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. నేషనల్ టాలెంట్ టెస్ట్ ఒలంపియాడ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన బహుమతి ప్రధానం చేశారు. ఈ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచిన మూడవ తరగతి విద్యార్థిని ఏ లాస్య ఫిరోజ్ ఖాన్ అద్వైత రోషిత విక్రం ములకు గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లు అందజేశారు లాస్యకు లాప్టాప్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. తొమ్మిదవ తరగతిలో అత్యున్నత ప్రదర్శన కనపరిచిన అల్లం పైవ్యశ్రీ వచన పల్లి చేత్రాలకు గోల్డ్ మెడల్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తే అది తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని ఆయన కోరారు సెల్ఫోన్లకు అలవాటు పడిన విద్యార్థులు భవిష్యత్తులో బెట్టింగులకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. తను కూడా విద్యార్థి దశలో ఇలాంటి పరీక్షల్లో 12,000 స్కాలర్షిప్ ను పొందిన విషయాన్ని గుర్తు చేశారు. తన విద్యార్థి జీవితాన్ని నెమరు వేసుకున్నారు పోటీ పరీక్షలకు వంద మంది విద్యార్థులు హాజరైతే 85 మంది విద్యార్థులు విజయం సాధించడం అభినందనీయం అన్నారు ప్రిన్సిపాల్ కోలా రామదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి, మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బండారి వెంకన్న , మాజీ టి పి సి సి సభ్యులు దాసురు నాయక్, ఆయుఃఖాన్, వేముల శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్ కోమల వెంకట్ రెడ్డి రాజేష్ కుమార్ సుమన్ అర్చన మౌనిక నూర్జహాన్ శ్రావణి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
నేడు సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం
సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని బాలల పుస్తక దినోత్సవం (Children’s Book Day) ప్రతి ఏడాది ఏప్రిల్ 2న జరుపుకుంటారు.
ఈ రోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సిరిసిల్ల లో బాల చెలిమి గ్రంథాలయములో , చదవడం, గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది.
ఈ రోజు విద్యార్థులు చవిచూసి, కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి పెంచేందుకు ఉద్దేశ్యమైంది.
అలాగే పుస్తకాలు చదివిన తరువాత కథ పై సమీక్షా రాయలని చెప్పడం జరిగింది.
Children’s
ఇది హాన్సా క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క జయంతి సందర్భంగా, అతను పిల్లల కథలను రచించడం మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మంచి పుస్తకాలు అందించడం ద్వారా ప్రసిద్ధి చెందాడు.
ప్రధానోపాధ్యాయులు L. శారదా మాట్లాడుతూ ఈ రోజు పిల్లలు పుస్తకాల మధ్య ప్రయాణం చేస్తూ, కొత్త కథలు చదవడానికి, అక్షరాల మహిమను తెలుసుకునేందుకు ప్రేరణ పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం లో బాల చెలిమి గ్రంధాలయం ఇంచార్జ్ ఎలగొండ రవి పాల్గొన్నారు.
మాల్కాజిగిరి నియోజికవర్గం, మౌలాలీ డివిజన్లో బత్తిని నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో పాత సఫిల్గూడ దర్గా మరియు మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగు దేశం పార్టీ 43వ అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టి ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షులు రామ్ మోహన్పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని నరసింహ గౌడ్, చింతల నరేష్ ముదిరాజ్, ప్రణయ్ చంద్ర, వెంకటరమణ, బాలరాజ్ యాదవ్, అంజిరెడ్డి, డా. కృష్ణ, జీలా రాములు, రమణయ్య, పరమేశ్, మౌలాలీ, అన్వేష్, అవినాష్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.