అంచున పొంచి ఉన్న ప్రమాదం…

అంచున పొంచి ఉన్న ప్రమాదం

ఆదమరిస్తే అనంత లోకాలకి

ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు
గుండాల,భద్రాద్రికొత్తగూడెం

జిల్లా,నేటిధాత్రి :

 

గుండాల నుండి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారి సాయనపల్లి గ్రామ సమీపంలో రహదారి మృత్యు మార్గంగా మారింది, ఆ రహదారి నుంచి వెళ్లే ప్రయాణికులు ఆదమరిస్తే అనంత లోకాలకు పోవడం ఖాయమని ఆదివాసీ నాయకులు సాయనపల్లి గ్రామానికి చెందిన వాగబోయిన చంద్రయ్య దొర అన్నారు. అయన మాట్లాడుతూ గత వర్షాకాలం సీజన్లో వరద ప్రవాహానికి కలవాటు కోతకు గురై ప్రమాదకరంగా మారింది స్థానిక పంచాయతీ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు ఇంతవరకు ఈ సమస్యపై దృష్టి సారించకపోవడంతో ప్రమాదకర మలుపుగా మారింది ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పలుమార్లు స్థానిక అధికార్ల కు చెప్పితే ఆర్ అండ్ బి అధికారలుకు తెలియజేసిన రెండు మూడు రోజులలో సరిచేస్తాం అని చెబుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే ప్రమాదకరమైన ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version