ఘనంగా మాయావతి 70వ జన్మదినోత్సవం…

ఘనంగా మాయావతి 70వ జన్మదినోత్సవం

పరకాల,నేటిధాత్రి

 

పట్టణకేంద్రంలో కేంద్రంలో నియోజకవర్గ ఇన్చార్జి కర్రె రమేష్ ఆధ్వర్యంలో బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి శనిగరపు రాజు హాజరై మాట్లాడుతూ ఈరోజు దేశం మొత్తం బహుజనులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజ్యాధికార రుచి చూపించి గర్వించదగ్గ రోజు అని మనువాద రాజకీయ పార్టీల గుండెల్లో వణుకు పుట్టించిన నాయకురాలు మాయావతి అని అన్నారు.మాయావతిని దేశ బహుజన కులాలన్నీ కలిసి ప్రధానమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాకి శరత్ చంద్ర,జిల్లా నాయకులు పసుల వినయ్ అంబేడ్కర్,మేకల విష్ణు నియోజకవర్గ ఉపాధ్యక్షులు పసుల బిక్షపతి,పట్టణ అధ్యక్షురాలు మడికొండ రవళి,పార్టీ వార్డు మెంబర్లు శనిగరపు రాహుల్,శనిగరపు రజినీకాంత్,గూడెల్లి శంకర్, బొట్ల భాస్కర్,క్రాంతి కుమార్, మనోజ్ కుమార్,హరీష్,సతీష్,అనిల్, మహేష్,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version