ముదిగుంట లో ఉపాధి హామీ ప్రారంభం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి.సర్పంచ్ ఆకుల రవి కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో సత్యనారాయణ పని స్థలాన్ని సందర్శించి నీటి నిల్వలను పెంపొందించడం కోసం తీసే కాలువలను త్రవ్వే పనులను ఉపాధి హామీ పథకం క్రింద ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో కూలీలతో చర్చ గోష్టి జరిపి, రోజువారి కూలి 307 రూపాయలు వచ్చుటకు త్రవ్వవలసిన ప్రభుత్వ నిర్దేశిత కొలతలను గురించి,పనిచేస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ,ఏపీవో,టెక్నికల్ అసిస్టెంట్,పంచాయతి కార్యదర్శి,ఫీల్డ్ అసిస్టెంట్,సర్పంచ్ రవికుమార్,ఉప సర్పంచ్ సంధ్యారాణి,వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
