కానిస్టేబుల్ రాజశేఖర్ కు డాక్టరేట్.!

కానిస్టేబుల్ రాజశేఖర్ కు డాక్టరేట్

యువ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలకు దక్కిన అరుదైన గౌరవం

ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ-న్యూ ఢిల్లీ, ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్ అమెరికా వారి ద్వారా డాక్టరేట్ ప్రదానం

వేములవాడ నేటిధాత్రి

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కి చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ యువతకి స్ఫూర్తి గా నిలుస్తూ యువతను పోలీస్, దేశ భద్రత దళాలోకి వెళ్లే విధంగా ఉచిత శిక్షణ ఇస్తూ యువత ను సమాజ సేవలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ-న్యూ ఢిల్లీ, ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్ అమెరికా వారు గౌరవ డాక్టరేట్ ని అందించి అభినందించారు.పోలీస్ ఉద్యోగ బాధ్యత లు నిర్వహిస్తూ దొరికిన కొద్ది సమయాన్ని యువత కోసం వినియోగిస్తూ వేములవాడ పట్టణ కేంద్రం గా గత 8 సంవత్సరాలనుండి యువతీ, యువకుల కు పోలీస్, ఆర్మీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబందించిన ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ని ఇస్తూ యువత ని వివిధ సేవా కార్యక్రమాలలో వాలంటీర్లు గా సేవలు అందించే విధంగా వారిని ప్రోత్సహిస్తూ, రక్త దానం వైపు యువత కి అవగాహన కల్పిస్తూ, రక్త దాన శిబిరాలు నిర్వహిస్తూ రక్త కొరత లేని సమాజం కోసం కృషి చేస్తూ, ఇప్పటి వరకు 35 సార్లు రక్త దానం చేసి యువత కు మార్గదర్శి గా నిలుస్తూ మరియు ఇప్పటి వరకు 50 మంది యువతని ప్రభుత్వ ఉద్యోగాలు పొందే విధంగా శిక్షణ ఇవ్వటం, కరోనా సమయం లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందులో యువత ని భాగస్వామ్యం చేస్తూ యువత కి ఆదర్శం గా నిలిచిన కానిస్టేబుల్ రాజశేఖర్ కు హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ లో ప్రతిష్టాత్మక డాక్టరేట్ ని అందించారు.

ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ తాను చేస్తున్న సేవ ని గుర్తించి డాక్టరేట్ ని అందించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారికి చైర్మన్ డా.ఆకుల రమేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు, యువత కి తన వంతుగా సేవ చేస్తూ వారిని సమాజ సేవ లో భాగస్వామ్యం చేస్తూ భవిష్యత్తు లో యువత కూడా సమాజ సేవ చేసే విధంగా వారిని తీర్చి దిద్దుతూ, చెడు వ్యాసనాలకు గురి కాకుండా మంచి మార్గం లో నడిపిస్తూ వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తూ సమాజం లో తన వంతు బాధ్యత ని నిర్వహించడం తనకి తృప్తి ని ఇస్తుంది అని తెలిపారు.తనకి సహకారం అందిస్తున్న పోలీస్ ఉన్నత అధికారులకు, యువ ఫౌండేషన్ అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ఈ డాక్టరేట్ ని అంకితం ఇవ్వటం జరుగుతుంది అని తెలిపారు.

కానిస్టేబుల్ తిరుపతి ని అభినందిస్తున్న నెక్కొండ ప్రజలు.

సలాం పోలీస్….

@ కానిస్టేబుల్ తిరుపతి ని అభినందిస్తున్న నెక్కొండ ప్రజలు

#నెక్కొండ, నేటి ధాత్రి :

పోలీసులంటే భయంతో వణికిపోయే ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ ను ఏర్పాటు చేయడంతో ప్రజలతో మమేకంగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో పోలీస్ సేవలు అత్యంత అమోఘం అని చెప్పవచ్చు. పోలీస్ సేవలో భాగంగానే 2024- 25 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తుండడంతో మొదటిరోజు పరీక్షకు నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్దకు వచ్చిన విద్యార్థిని తన పరీక్ష కేంద్రం అక్కడ కాదని నెక్కొండ మోడల్ స్కూల్లో ఉందని ఉపాధ్యాయులను తెలుసుకొని నెక్కొండ ప్రభుత్వ కాలేజీ నుండి ప్రభుత్వం మోడల్ స్కూల్ లో పరీక్ష రాయవలసి ఉండడంతో సమయం కూడా కేవలం ఐదు నిమిషాల సమయం ఉండడంతో ఆ విద్యార్థి ఇక పరీక్ష రాయలేనేమో అని బోరున్న విలపించగా అక్కడే విధులు నిర్వహిస్తున్న బానోతు తిరుపతి అనే కానిస్టేబుల్ వెంటనే ఆ విద్యార్థి దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని తెలుసుకుని ఐదు నిమిషాల వ్యవధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మోడల్ స్కూలుకు తన బైక్ పై తీసుకువెళ్లి నిర్ణీత ఐదు నిమిషాల వ్యవధిలో విద్యార్థిని పరీక్షకు హాజరు చేయడంతో ఆ విద్యార్థిని కానిస్టేబుల్ తిరుపతికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది. ఇది అంతా ఓ వ్యక్తి వీడియో తీసి పలు నెక్కొండ మరియు వివిధ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో సలాం పోలీస్ అన్న అంటూ కానిస్టేబుల్ తిరుపతి ని నెక్కొండ ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version