నాగర్ కర్నూల్ పట్టణంలో నూతన ప్రభుత్వ జూనియర్

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

 

నాగర్ కర్నూల్ పట్టణంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డాక్టర్ మంత్రివర్యులు దామోదర
రాజనర్సింహగారు
నాగర్ కర్నూల్ పట్టణంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి కృషితో 9 కోట్ల రూపాయల తో మంజూరైన నూతన ప్రభుత్వ కళాశాల భవనం నిర్మాణానికి మరియు 20 కోట్ల రూపాయలతో పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు గాను స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో గారితో కలిసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహగారు
వీరితోపాటు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురై గారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష గారు మార్కెట్ చైర్మన్ రమణారావు గారు మాజీ కౌన్సిలర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ ను అభినందించిన అధికారులు

ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ ను అభినందించిన అధికారులు

పరకాల,నేటిధాత్రి

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ బి. సంతోష్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణ మరియు కళాశాల విద్య కమిషనర్ ఎ.దేవసేన అభినందించారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల తొర్రూరులో ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో గేల్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారి సహకారంతో నాలుగు కోట్లు మంజూరు చేయించి నూతన కళాశాల భవనాన్ని నిర్మించినందుకు అలాగే ప్రస్తుతం పరకాలలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి కృషి చేసినందుకు మరియు డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెంచడంతోపాటు వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నందుకుగాను అక్టోబర్ 29,30 తేదీల్లో రెండు రోజులపాటు హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ సమావేశంలో ఆయనను అధికారులు ప్రశంసించి, అభినందించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version