ఆషాడమాసంలో గోరింటాకు పండగ

ఆషాడమాసంలో గోరింటాకు పండగ

గోరింటాకు పండగను జరుపుకుంటున్న మహిళలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో
శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ఆషాడ శుక్ల త్రయోదశి. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా మహిళలందరూ ఆషాడ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా భావించి మహిళలు అందరూ కలిసి రామాలయం ఆవరణంలో గోరింటాకు పండగను జరుపుకున్నారు.
గోరింటాకు ఆషాడ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి

 

 

పూర్వము పార్వతీదేవి ఒకరోజు చేతులకి గోరింటాకు పెట్టుకుంటుండగా గోరింటాకు చెట్టు పార్వతి దేవిని ఈ విధముగా కోరింది ప్రజలందరూ గోరింటాకు చెట్టును గుర్తించాలి అని కోరింది అందుకు పార్వతీదేవి ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల మహిళలకు సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని పొందవచ్చు అని పార్వతి దేవి చెప్పింది.
అందువల్ల మహిళల ందరూ ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఒక సాంప్రదాయంగా భావించి జరుపుకుంటారు
మహిళలు మాట్లాడుతూ. గోరింటాకు పండగను ప్రతి సంవత్సరం రామాలయంలో వైభవంగా జరుపుకుంటాము.
గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోరింటాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరానికి చలవ చేస్తాయి ఒత్తిడిని తగ్గిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అదేవిధంగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలు సౌభాగ్యంగా భావిస్తారు వివాహమైన స్త్రీలకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అని భావిస్తాము అందుకొరకు ప్రతి ఆషాడ మాసంలో గోరింటాకు పండగను ఎంతో సాంప్రదాయంగా జరుపుకుంటాము.
ప్రతి ఆషాడ మాసంలో మహిళలు గోరింటా కు పండగను జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

ఘనంగా పిజేపిఎస్ 8 వ వార్షికోత్సవం..

ఘనంగా పిజేపిఎస్ 8 వ వార్షికోత్సవం.

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక..

నర్సంపేట:నేటిధాత్రి

పాకాల పత్రిక విలేకరుల పరస్పర సహకార సంఘం 8 వ వార్షికోత్సవం నర్సంపేట పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో సంఘం అధ్యక్షుడు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు.నర్సంపేట ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టుల అభివృద్దే లక్ష్యంగా గత 8 సంవత్సరాలు జర్నలిస్టుల పరపతి సహకార సంఘం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు.ఒకరికొరకు పరస్పరం సహకారం చేసుకుంటూ ముందుపోవాలని ఈ సందర్భంగా సూచించారు.అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక..

పాకాల పత్రిక విలేకరుల పరస్పర సహకార సంఘం నూతన కమిటీని ఎన్నికల అధికారులుగా పోడేటి అశోక్, కాసర్ల నరసింహరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహింఛారు. నూతన అధ్యక్షులుగా కోదాటి గోపాలకృష్ణ,కార్యదర్శిగా రడం శ్రీనివాస్ గౌడ్,ఉపాధ్యక్షులుగా పాలంచ సత్యనారాయణ,
కోశాధికారిగా సామల అనిల్ కుమార్,సహాయ కార్యదర్శిగా కందుల శ్రీనివాస్ గౌడ్,గౌరవ అధ్యక్షులుగా వేములపల్లి వెంకటరామయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పిట్టల కుమారస్వామి,శీలం రమేష్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్,తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్,కర్ల వెంకటరెడ్డి, మచ్చిక రమేష్ గౌడ్, పెండెం శివానంద్,జూలూరి హరిప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎపి ఫోరం ఫర్ అంగన్వాడి యూనియన్ వార్షికోత్సవం.

పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి08:

ఏపీ ఫోరం ఫర్ అంగనవాడి వర్కర్స్, హెల్పర్స్ ,అండ్ మినీ వర్కర్స్ యూనియన్ ప్రధమ వార్షికోత్సవాన్ని పలమనేరు పట్టణంలో జాతీయ మానవ హక్కుల కార్యాలయం నందు ఆ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సరస్వతి అధ్యక్షతన భారీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ ప్రథమ వార్షికోత్సవానికి ఆ యూనియన్ చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు డివి మునిరత్నం ముఖ్యఅతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏపీ ఫోరం పర్ అంగన్వాడి యూనియన్ ఏర్పడి ఒక సంవత్సరం గడుస్తున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రారంభము నుండి కూడా ఇప్పటివరకు తమ యూనియన్ అంగన్ వాడి వర్కర్లు హెల్పర్లు, మినీ వర్కర్ల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. అంగన్వాడీలకు ఉన్న సమస్యలను ఇప్పటికే అనేక చోట్ల ముందుండి యూనియన్ పరిష్కారం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు పడుతున్న బాధలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా ఫోరం పర్ అంగన్వాడి యూనియన్ ని ఏర్పాటు చేశామని తమ యూనియన్ దోపిడీ, స్వార్థం లేని సహకారం అందించడానికి అంగన్వాడీలను భుజం తట్టి మేల్కొల్పడానికి సిద్ధంగా ఉందన్నారు. అలాంటి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నాం కాబట్టి తమ యూనియన్ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అంగన్వాడి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఆహ్వానించడం శుభ పరిణామం అన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రములో అంగన్వాడిలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో అంగన్వాడీలకు సమస్య వచ్చినప్పుడు నిర్భయంగా తమ యూనియన్ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వాసుపత్రిలో పిల్లలకు సంబంధించిన జనన ధ్రువ పత్రాలను సకాలంలో పంపిణీ చేస్తే అంగన్ వాడీలు ఆధార్ కార్డులు తీసుకోవడానికి వీలుంటుందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకమ్మ నాగరత్న, భాగ్యలక్ష్మి, నిర్మల, మునెమ్మ, కవితమ్మ, శ్రీదేవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version