బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్
కీసర నేటి దాత్రి :
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
కీసర మండల చీర్యాల గ్రామ మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో బండారు నరసింహ యాదవ్, గూడ నరేష్ గౌడ్, సాయికుమార్ గౌడ్, తదితరులు బిజెపిలో చేరారు వారిని ఈటల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమము బిజెపి కీసర మండల అధ్యక్షులు కోళ్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, పట్లోళ్ల విక్రం రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు