బాధిత మెకానిక్ కుటుంబాలకు రూ.30 వేలు ఆర్థిక సాయం
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 21:
ముగ్గురు బాధిత టు వీలర్స్ మెకానిక్స్ కు తిరుపతి టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి తెలియజేశారుతిరుపతికి చెందిన గోపాల్ (హార్ట్), చంద్రగిరి కి చెందిన చిన్న తంబి ( కిడ్నీ), తలకోనకు చెందిన సుబ్రహ్మణ్యం ( కాలు విరిగి) సమస్యలతో బాధపడుతున్న ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఆవుల ముని రెడ్డి తన తోటి అసోసియేషన్ నేతలు సభ్యులతో కలిసి అందజేశారు. అలాగే 70 మంది మెకానిక్ లకు స్పెషల్ టూల్ కిట్స్ అందజేశారు. అంతేకాకుండా బోస్ డి ఎస్ 7 కంపెనీ ఏరియా మేనేజర్ సతీష్ చంద్ర తో త్వరలో ఆ కంపెనీ బైక్ ను గురించి టూవీలర్స్ మెకానిక్లకు అవగాహన కల్పించినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణరావు సెక్రెటరీ గురు ఆచారి జాయింట్ సెక్రెటరీ తేజారెడ్డి ట్రెజరర్ బాబు కమిటీ మెంబర్లు నాగరాజు పాపయ్య మురుగ, బాధిత మెకానిక్స్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.