మరిచిపోయిన హ్యాండ్ బ్యాగు చోరీ కేసు ఛేదించిన పోలీసులు

మరిచిపోయిన హ్యాండ్ బ్యాగు చోరీ కేసు ఛేదించిన పోలీసులు

వరంగల్, నేటిధాత్రి.

వరంగల్ నగరంలో మరిచిపోయిన హ్యాండ్ బ్యాగును చోరీ చేసిన కేసును ఇంతజార్గంజ్ పోలీసులు ఛేదించారు. కొత్తగూడెం నివాసి శ్వేత అను మహిళ 26-01-2026 తెల్లవారుజామున వేములవాడకు వెళ్లేందుకు వరంగల్ వెంకట్రామ్ వద్ద బస్సు ఎక్కే సమయంలో ఆత్రుతలో టీవీఎస్ షోరూం ముందు హ్యాండ్ బ్యాగును మరిచిపోయింది.

ఆ బ్యాగులో మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.30,000 నగదు మరియు ఒక వివో స్మార్ట్ ఫోన్ ఉన్నాయి. ఈ విషయమై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంతజార్గంజ్ పోలీసులు క్రైమ్ నంబర్ 34/2026 గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల విచారణలో టీవీఎస్ షోరూం ఉద్యోగి పల్లకొండ వేణు దొంగిలించాలనే ఉద్దేశంతో తన భార్య కళ్యాణి, తల్లి సరోజనతో కలిసి ముఖాలకు మాస్కులు కట్టుకొని వచ్చి, మరిచిపోయిన బ్యాగు తమదేనని వాచ్మెన్ కేదారిని నమ్మించి మోసపూరితంగా బ్యాగును తీసుకెళ్లినట్లు గుర్తించారు.

సీసీ కెమెరాలు, ఐటీ కోర్ సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు ఈరోజు వాహనాల తనిఖీ సమయంలో నిందితులు వేణు, కళ్యాణిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు తులాల బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ మరియు రూ.5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నగదును ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

నిందితులను రిమాండ్‌కు తరలించగా, వేణు తల్లి సరోజన పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ఇంతజార్గంజ్ ఇన్స్పెక్టర్ ఎం.ఏ. షుకూర్, ఎస్సై సందీప్, పిఎస్సై తేజ, కానిస్టేబుల్స్ దీపక్, సురేష్ మరియు ఐటీ కోర్ సిబ్బంది సల్మాన్ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.

 జాగ్రత్త.. ఈ 3 తప్పులు మిమ్మల్ని నవ్వులపాలు చేస్తాయి…

 జాగ్రత్త.. ఈ 3 తప్పులు మిమ్మల్ని నవ్వులపాలు చేస్తాయి

సమాజంలో గౌరవం, గుర్తింపు పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొన్ని చిన్న తప్పులు మనల్ని ఇతరుల ముందు నవ్వులపాలు చేసి, మన విలువను తగ్గిస్తాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఏ తప్పులు మన గౌరవాన్ని దెబ్బతీస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో గౌరవం పొందాలంటే కొన్ని అలవాట్లు తప్పనిసరిగా మానుకోవాలని ఆచార్య చాణక్యుడు సూచించారు. ఎందుకంటే.. కొన్ని చిన్న తప్పులే మనల్ని ఇతరుల ముందు నవ్వులపాలు చేసి, మన విలువను తగ్గిస్తాయి. ఇప్పుడు అలాంటి మూడు ముఖ్యమైన తప్పుల గురించి తెలుసుకుందాం..
ఆలోచించకుండా వాదించడం..

ప్రతి చిన్న విషయానికీ వెంటనే వాదనకు దిగే వాళ్లను సమాజం సీరియస్‌గా తీసుకోదని చాణక్యుడు తెలిపారు. కోపంతో లేదా సరైన సమాచారం లేకుండా మాట్లాడితే మన మాటలకు విలువ ఉండదు. అలాంటి వాళ్లను ఇతరులు తేలికగా తీసుకుంటారు, ఎగతాళి కూడా చేస్తారు. కాబట్టి మన అభిప్రాయాన్ని చెప్పేముందు ఆలోచించాలి, విషయం పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. అలా చేస్తేనే మన మాటలకు గౌరవం ఉంటుంది..
ఇతరులను అనుసరించడం..

ఇతరుల నడవడి, మాట్లాడే శైలి, జీవన విధానాన్ని అనుసరించడం మంచిది కాదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు. అలా చేస్తే మనకు ప్రత్యేక గుర్తింపు ఉండదు. ఎప్పుడూ ఇతరుల్ని అనుసరించే వ్యక్తి.. జీవితంలో ముందుకు సాగలేడు. ప్రతి ఒక్కరికీ తనకంటూ ప్రత్యేకత ఉంటుంది. మన సామర్థ్యాన్ని గుర్తించి, మనదైన మార్గంలో ముందుకు వెళ్లాలి. అప్పుడే సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది.

అతిగా మాట్లాడటం..

తమకు లేని గుణాలను ఉన్నట్టు చూపించడం, ప్రతి దానిలోనూ గొప్పగా మాట్లాడటం, అవసరం లేని చోట్ల జోక్యం చేసుకోవడం వంటివి చేస్తే ఇతరులు నవ్వుతారని చాణక్యుడు వివరించారు. ఇలా చేయడం వల్ల మన ఆత్మవిశ్వాసం కూడా బలహీనంగా కనిపిస్తుంది. మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండాలి. అవసరమైనప్పుడు ఆలోచించి మాట్లాడితేనే మన మాటలకు విలువ ఉంటుంది, గౌరవం పెరుగుతుంది.

యువకుడి దారుణం.. కోరిక తీర్చలేదని యువతిని..

యువకుడి దారుణం.. కోరిక తీర్చలేదని యువతిని..

 

కర్ణాటకలో దారుణం జరిగింది. రాత్రి వేళ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువకుడు.. తన కోరిక తీర్చమని ఆమెను బలవంతపెట్టాడు. ఆమె నిరాకరించడంతో గొంతు నులిమి చంపేశాడు.

ఇంటర్నెట్ డెస్క్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రాత్రి వేళ ఆమె ఇంట్లోకి ప్రవేశించిన అతడు.. తన కోరిక తీర్చమని బలవంతపెట్టాడు. ఆమె కాదనటంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల డీకే షర్మిళ అనే యువతి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. రామమూర్తి నగర్‌, సుబ్రమణి లేఅవుట్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటోంది. షర్మిళ పక్క ఫ్లాట్‌లో కర్నల్ కురయ్ అనే యువకుడు ఉంటున్నాడు. కర్నల్ కన్ను షర్మిళపైన పడింది. ఎలాగైనా ఆమెతో తన కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు.
సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. జనవరి 3న రాత్రి 9 గంటలకు షర్మిళ ఇంట్లోకి ప్రవేశించాడు. కిటికీ ద్వారా అతడు ఇంట్లోకి చొరబడ్డాడు. నేరుగా షర్మిళ దగ్గరకు వెళ్లి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కర్నల్ ఆమె నోరు, గొంతు గట్టిగా నొక్కిపట్టాడు. ఊపిరి ఆడకపోవటంతో ఆమె స్పృహకోల్పోయింది. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు గాయాలు కూడా అయ్యాయి. షర్మిళ చనిపోయిందని భావించిన కర్నల్ ఆధారాలను నాశనం చేయాలని అనుకున్నాడు. షర్మిళ బట్టలు, ఇతర వస్తువుల్ని బెడ్‌పై పడేసి నిప్పుపెట్టాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత షర్మిళ చనిపోయింది.ఇంట్లోంచి పొగలు రావటం గుర్తించిన పొరిగింటి వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పారు. బెడ్‌రూములో షర్మిళ విగతజీవిగా కనిపించింది. అగ్నిమాసక సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు షర్మిళ శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పొగ కారణంగా ఆమె ఊపిరి ఆడక చనిపోయి ఉంటుందని పోలీసులు మొదట భావించారు. సైంటిఫిక్ పద్దతులు, టెక్నికల్ ఆధారాలతో కర్నల్ ఈ హత్యకు పాల్పడినట్లు కనుగొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version