విద్యార్థుల క్షేత్ర పర్యటన
క్షేత్ర పర్యటన ద్వారా ప్రత్యక్ష అనుభవంతో విజ్ఞానం
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి దాత్రి
మండలంలోని శ్రీ వివేకవర్ధిని హై స్కూల్ విద్యార్థులు బుధవారం క్షేత్ర పర్యటనలో భాగంగా మల్యాల లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారని పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. పాఠశాలకు చెందిన 8 , 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులను క్షేత్ర ప్రదర్శనకు తీసుకువెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా యాకాంతం గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వకుండా క్షేత్ర పర్యటన ద్వారా ప్రత్యక్ష అనుభవంతో ఎక్కువ విజ్ఞానాన్ని పొందుతారన్నారు. కృషి విజ్ఞాన కేంద్రంతోపాటు హార్టికల్చర్ సెంటర్ ను విద్యార్థులు సందర్శించడం జరిగింది. విద్యార్థులు శాస్త్రవేత్తలను తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ మాలతి, క్రాంతి కుమార్, ఉపాధ్యాయులు మహమ్మద్ అఫీజ్, సుభాష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.