వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కల నాటింపు.
నాగర్ కర్నూల్/నేటి దాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి వనమహోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మన ప్రియతమ నాయకుడు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కల్వకుర్తి రోడ్డులో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పునాదులు వేశారు.
అంతేకాకుండా, మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం సమీపంలో నూతనంగా మంజూరైన డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి పథంలో మరో అడుగు వేసారు.పర్యావరణ పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోన్న ప్రజాప్రతినిధికి అభినందనలు.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ ఛైర్మెన్ రమణ రావు , మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ జంగయ్య ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ , మాజీ ఎంపీపీ బండా పర్వతాలు ,తెల్కపల్లి మండల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.