పొగలు కక్కుతున్న ‘పిరమల్ ఫార్మా..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-27T120840.789.wav?_=1

 

పొగలు కక్కుతున్న ‘పిరమల్ ఫార్మా

◆:- కాలుష్యంగా మారుతున్న పరిసర ప్రాంతాలు

◆:- ప్రజలను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు

◆:- కాలుష్య నివారణ చర్యలు ఎక్కడ?

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహర్ మండలు దిగ్వాల్ గ్రామంలో 25 సంవత్సరాలుగా నడుస్తున్న పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ యూనిట్ నుంచి క్రమం తప్పకుండా రోజూ ఉద్భతంగా పొగలు కక్కుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల దిగ్వాల్, చుట్టుపక్కల గ్రామాల పరిసర ప్రాంతాలు కాలుష్యంగా మారుతున్నాయి. దీంతో ప్రజలను అనేక రోగాలు వెంటాడుతున్నాయి. దీంతో ఏం చేయాలో, తెలియని అయోమయంలో ప్రజలు ఉన్నారు. అంతేకాకుండా. గ్రామాల్లో ఉన్న భూగర్భ జలాలు, నేల, గాలి అంతా కాలుష్యానికి గురై ప్రజలకు ఇబ్బందిగా మారాయి దీంతోపాటు రైతుల పండిస్తున్న పంటలు పాడే నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్న కాలుష్య నివారణపై అధికారులు చర్మలు తీసుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నారు.

గతంలో జరిమాన.. మారని తీరు

గతంలో ఈ కంపెనీపై అధికారులు జరిమాన విధించారు. కానీ కంపెనీ యాజమాన్యం తీరు మర్చుకోకుండా మళ్ళీ కంపెనీ రాత్రి పగలు తేడా లేకుండా. మళ్ళీ పొగ వదలుతున్నారని పలువురు వాపోయారు. దిగ్యాల్లో 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫార్మా యూనిట్. గత 2018-19లో నీటి కాలుష్యం కారణంగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎ స్టి 2019లో రూ.6.31 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా రోజుకు రూ.60,000గా 1,386 రోజులకు వర్తించేలా నిర్ణయించారు. యూనిట్ చుట్టూ 1.5 కి.మీ. వరకు దక్షిణ దిశలో, తూర్పు, పడమర దిశల్లో 500 మీటర్ల వరకు భూమి, భూ గర్భ జలాలు కాలుష్యమై మురికిగా మారాయి. ఈ కాలుష్యం వల్ల. రైతులు పొలాలు, పంటలు దెబ్బతిన్నాయి.

దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకొనే పరిస్థితి

కంపేనీ నుంచి వచ్చె పర్దా జరాల వలన గ్రామంలోని భూగర్భ ఇబాలు కాలుష్యమై మురికిగా మారి దుర్వాసనను వెదజబుతున్నాయి. ఆ నీరు వంట పొలాల్లోకి చేరి పంటలు పొ అందకుండా అవుతున్నాయి. అంతేకాకుండా గ్రామాల ప్రజలు తాగే నీరు కూడా కాలుష్యమవుతున్నాయి. ఆ నీరును ప్రజలు తాగడం, వల్ల చర్మ రోగాలు, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. కాగా తాగటానికి దూర ప్రాంతాల నుంచి మినరల్ వాటర్ కొనుగోలు చేసుకొని తాగే పరిస్థితులు ఏర్పడినాయి. ఇలా ఎంతకాలం బ్రతకాలని అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిర్యాదు చేసిన జరగని పూర్తి నివారణ

గ్రామంలో సగం మందికి పైగా ఆరోగ్య సమస్యలతో
బాధపడుతున్నారని, 2005 నుంచే ఈ కాలుష్యం గురించి ఫిర్యాదులు అధికారులకు అందజేశామని గ్రామస్తులు తెలిపారు. పిర్యాదులు అందించిన పూర్తి నివారణ జరగలేదుని. అంతేకాకుండా ఇప్పటివరకు కూడా పరిస్థితి మారలేదు. యూనిట్ నుంచి ఉన్నత పొగలు, రాత్రి పగలు తేడా లేకుండా. పొగ విడుదలలు కొనసాగుతున్నాయి. ఇటీవల బయోమాస్ బ్రికెట్లకు మారడం ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గించుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది, కానీ స్థానికులు దీన్ని కాగితం మీద మాటలుగా చూస్తున్నారు.

రివర్స్ ఓస్మోసిస్ తోనే పర్యావరణానికి హాని

గ్రామంలోనే పిరమల్ ఆరోగ్య సేవా కేంద్రం ఉంది, కానీ కొందరు దీన్ని కాలుష్యం చేసి, నీటి ఏటీలు వాటర్ ఏటీలు ద్వారా లాభపడటం’గా ఆరోపిస్తున్నారు. రివర్స్ ఓస్మోసిస్ (ఆర్ఎ) టెక్నాలజీతో నీరు సరఫరా చేస్తున్నారని. ఇది కూడా పర్యావరణానికి హాని కలిగిస్తోందని పలువురు అంటున్నారు. గ్రామ ప్రజలు 2018లో యూనిట్ విస్తరణకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్లో ఆందోళన వక్తం చేశారు. మా గాలి, నీరు, నేల మీద హక్కు మాకే అనే నినాదాలతో ఆందోళన చేశారు.తెలంగాణలో ఫార్మా హబ్ మారుతున్నప్పటికీ, ఈ కాలుష్య సమస్యలు రాష్ట్ర విధానాల్లో లోపాల వల్లే పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పై స్పందించి అధికారులు న్యాయం చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,

దిగ్వాల్ పిరమల్ పార్మా కంపెనీ విషపూరిత వ్యర్థాలను విడుదల చేయడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు

కాలుష్య నివారణ చర్యలు ఎక్కడ?

కాలుష్య నియంత్రణ మండలి పిసిబి అధికారుల విస్తృత నిర్లక్ష్యం వల్ల దిగ్వాల్ పిరమల్ ఫార్మా కంపెనీ వల్ల కలిగే తీవ్రమైన వాయు మరియు నీటి కాలుష్యం నివాసితులు ఇబ్బంది. పడుతున్నారు. పదేపదే తనిఖీలు చేసినప్పటికీ, పరిశ్రమలు విషపూరిత వాయువులు మరియు ప్రమాదకర వ్యర్థాలను విడుదల చేస్తూనే ఉన్నాయి,
దీనివల్ల స్థానికులు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు మరియు ఉబ్బసం బారిన పడుతున్నారు, వ్యవసాయ భూములు ఎండిపోతాయి మరియు పశువులు చనిపోతాయి. పిసిబి అధికారులు ప్రజారోగ్యం కంటే కార్పొరేట్ లాభాలకు ప్రాధాన్యతనిస్తూ, పరిశ్రమ యజమానుల “కీలుబొమ్మలు”గా మారారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్య
కారక పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు పిసిలి నిర్లక్ష్యంపై విచారణ జరపాలని డిమాండ్లు పెరుగుతున్నాయి, ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వం ఇప్పుడు చర్య తీసుకోవడంలో విఫలమైతే, ప్రజల జీవితాలు మాత్రమే కాకుండా ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కూడా కూలిపోతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version