దళితులకు 50 సంవత్సరాలకే ఫించన్ ఇవ్వాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* డిమాండ్.

చిట్యాల, నేటిధాత్రి :

భారత దేశం లోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారని వారికి 50 సంవత్సరాలు నిండిన వారికి వ్రృద్దాప్య ఫించన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య* ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
సోమవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన జరిగిన సమావేశంలో మల్లయ్య మాట్లాడుతూ…. దళితులు అభివృద్ధి చెందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఇతర కులాలకు 50 సంవత్సరాలు నిండిన వారికి పించన్లు ఇచ్చిందని తెలిపారు .ఈ ప్రభుత్వం కూడా 50 సంవత్సరాలు నిండిన ప్రతి దళితుడికి పించన్లు మంజూరు చేయాలని దళిత కుటుంబాలు అభివృద్ధి చెందుటకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ టేకుమట్ల మండల అధ్యక్షుడు అరకొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *