MP Vamshi Krishna’s Morning Walk Surprise
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మార్నింగ్ వాక్
శ్రీరాంపూర్ :నేటి ధాత్రి
శ్రీరాంపూర్ ప్రాంతంలోని ప్రగతి మైదానంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఉదయం మార్నింగ్ వాక్ చేసి వాకర్స్ ను ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థి, యువకులు, మహిళల,కార్మిక వర్గ, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రజా గొంతుకై పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాని ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె నర్సింగ్, జిల్లా నియోజక వర్గ ఏరియా నాయకులు కే వినయ్ ప్రశాంత్, డి మురళి, బి ఒదేలు, బి నర్సయ్య సిచ్ వాసు ఎం శ్యాముల్, కొమురయ్య పాల్గొన్నారు
