pariksha kendralanu sandarshinchina cp doctor ravinder, పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌

పరీక్షా కేంద్రాలను సందర్శించిన సీపీ డాక్టర్‌ రవీందర్‌

స్టఫండరీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్ష జరుగుతున్న పరీక్షా కేంద్రాలను శనివారం వరంగల్‌ నగర పోలీస్‌ కమీషనర్‌ డాక్టర్‌ వి. రవీందర్‌ సందర్శించారు. ఈ సందర్బంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన ఏర్పాట్లపై పోలీస్‌ కమీషనర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఉదయం, మద్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రం ఆవరణలోనే తినుబండారాలు కొనుగోలు చేసుకొనేందుకు వీలుగా పుడ్‌స్టాల్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత పరీక్షా కేంద్రం ఇంచార్జ్‌లకు పోలీస్‌ కమీషనర్‌ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *