
ప్రజాస్వామ్య పరిరక్షణ లో జర్నలిస్టుల పాత్ర కీలకం
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్. మరిపెడ నేటిదాత్రి. ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారదులుగా జర్నలిస్టులు నిలుస్తారని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ పట్టణంలో మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యేను కలవగా ప్రెస్ క్లబ్ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.ప్రభుత్వ పథకాలను మారుమూల పల్లెలకు చేరవేయడంలో విలేకరుల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో…