ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవకతవలు చేస్తే కఠిన చర్యలు
భూపాలపల్లి నేటిధాత్రి
తాలు, తడక పేరుతో రైతులను దోపిడీకి గురిచేస్తే ఎంతమాత్రం సహించేదిలేదని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మిల్లర్లును హెచ్చరించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ధాన్యం, మక్కలు కొనుగోలుపై రెవిన్యూ, పౌరసరఫరాలు, పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయ, మార్కెటింగ్ రవాణ, డిఆర్డిఓ, సహకార, పంచాయతీరాజ్, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుకు ట్రక్ షీట్ ఇవ్వకపోవడం పట్ల రైతుల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 30 రోజులు దాన్యం, మక్కల కొనుగోలులో చాలా ప్రతిష్టాత్మమని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని తెలిపారు. సమావేశాల్లో మాట్లాడుకున్నది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటా వేసిన తదుపరి రైతుకి ఏమి సంబంధమని, ట్రక్ షీట్ జారీ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని, దాని వల్ల రైతుల ఇబ్బందులకు గురి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యం జరుగుతుందని అందుకు ఆయా శాఖల అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తాలు పేరుతో అబద్ధాలు ఆడొద్దని సూచించారు.
మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులతో వరి కోత యంత్రాల యజమానులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. తాలు, తరుగులు తీయొద్దని మిల్లర్లుకు పలుమార్లు చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మీ సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం కానీ రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన తదుపరి కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, మిల్లర్లదే బాధ్యతని కాంటా అయ్యేంత వరకు మాత్రమే రైతు బాధ్యతని తెలిపారు. అకాల వర్షాలకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులను ఎందుకు ఇబ్బందులు గురి చేస్తున్నారని అని ప్రశ్నించారు. ఇది రైతు చేసిన పాపమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాము, రవాణా, కాంటా సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రవాణాలో ఇబ్బందులు కల్పిస్తే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రవాణాలో ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఇదే చివరి వార్నింగ్ అని హెచ్చరించారు. రైతులకు 48 గంటల్లో నగదు జమ చేసేందుకు కొనుగోలు జరిగిన వెంటనే ఓపిఎంఎస్ లో నమోదు చేయాలని తెలిపారు. రైస్ మిల్లులు వద్ద దాన్యం దిగుమతి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి తనకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్ఓ వసంతకుమారి, పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, డిఎం రాములు, వ్యవసాయ అధికారి బాబూరావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, రమణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని, డిఆర్డిఓ బాలకృష్ణ, సహకార అధికారి వాలియా నాయక్, డిపిఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి రూరల్, అర్బన్ ఘనపూర్ మండలాలకు చెందిన సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. ఈ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి అర్బన్ & రూరల్ కు చెందిన మొత్తం 46 చెక్కులను రూ.18,45,700 విలువతో ఘనపూర్ మండలానికి చెందిన 31 చెక్కులను రూ.9,74,300 విలువతో పంపిణీ చేశారు. అదేవిధంగా 23వ వార్డుకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమం, వైద్య సేవలు పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. సీఎం ఆర్ ఎఫ్ ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కౌన్సిలర్లు అప్పం కిషన్ బొడ్డు అశోక్ తోట రంజిత్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
– డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సూర దేవరాజు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలోని 12వ వార్డు చంద్రంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, కాంగ్రెస్ కాంటెస్టెడ్ కౌన్సిలర్ సూర నిర్మల కలిసి ప్రారంభించారు. నర్మెట దుర్గవ్వ-నరసయ్య, భారతి-దేవయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను వారు ప్రారంభించి గృహ యజమానులను అభినందించారు.
అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల పేద ప్రజలకు మేలు జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా లబ్ధిదారులు సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని, లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తెరపాక ఎల్లయ్య, గుడిసెట్టి బాలరాజు, తడక వెంకటేశం, మ్యాన సత్యనారాయణ, అబ్బగోని లచ్చయ్య, కోలకని రాజేశం, ఆడెపు ప్రసాద్, సదుల గంగాధర్, కోలకాని ఎల్లయ్య, ఎర్ర నరసయ్య తదితర కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మూడో వార్డు లో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన వద్దిగాళ్ల రాములమ్మ గారి కుటుంబ సభ్యులకు బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత గారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యుల సహకారంతో 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది.
రాములమ్మ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ వైస్ చైర్మన్ బరిగే రమ్య రాoచందర్, ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుడ్ల నరేష్ కుమార్, బూడిద భాస్కర్ , బుగ్గ శ్రీకాంత్ , బూడిద ప్రశాంత్, గుడ్ల మల్లేష్ , కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యతేనే దోపిడి విముక్తికి మార్గం
మోడీ విధానాలు దేశానికి అత్యంత ప్రమాదకరం
ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్
నర్సంపేటలో ఎంసీపీఐ(యు) భారీ ప్రదర్శన -బహిరంగ సభ
ఆకట్టుకున్న కళారూపాలు, పాటలు
నర్సంపేట,నేటిధాత్రి:
దేశంలో పెరిగిపోతున్న దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయమని ఎంసిపిఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, పోలిట్ బ్యూరో సభ్యులు కుల్దీప్ సింగ్ అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసిపిఐ (యు) వ్యవస్థాపకులు, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా నర్సంపేటలోని నెక్కొండ రోడ్డు సర్కిల్ నుంచి సిటిజన్ క్లబ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీ ముందు కోలాటాలు డప్పు బృందం కళాకారుల ఆటపాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ముఖ్య అతిధులుగా హాజరైనా మద్దికాయల అశోక్ ఓంకార్, కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ దేశంలో మోడీ అనుసరిస్తున్న విధానాలు ప్రజలను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయని ఈ క్రమంలో మత వైరుధ్యాలు నియంతృత్వాన్ని పెంచి పోషిస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ఉద్యమిస్తే తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. ఆ దిశలో వర్గ సామాజిక పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.అరుణోదయ విమలక్క, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపెళ్లి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఎస్ యు సి ఐ రాష్ట్ర నాయకులు గంగాధర్ లు మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ పీడిత ప్రజల పక్షాన పోరాడిన యోధుడని చట్టసభలకు వన్నె తెచ్చాడని రాజకీయ విలువలకు ఆదర్శాలకు త్యాగాలకు నిలువుటద్దంగా నిలిచాడని ఆయన కోరుకున్నట్లు లాల్ నీల్ ఐక్యతను పెంపొందించాలని ఆయన ఆశయ సాధనలో అంతరాలు లేని సమాజ స్థాపనకు చేయాలని పిలుపునిచ్చారు.
ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలను పాఠ్యాంశంలో చేర్చి వారి గుర్తుగా స్మారక చిహ్నాలు మ్యూజియం ఏర్పాటు చేయాలని, కామ్రేడ్ ఓంకార్ పేరుతో నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి, స్టేడియంకు నర్సంపేట నుంచి వరంగల్ ప్రధాన రహదారికి నామకరణం చేయాలని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కాంస్య విగ్రహాలు పెట్టించాలని విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి వనం సుధాకర్ కుంభం సుకన్య గోనె కుమారస్వామి వస్కుల మట్టయ్య వరికుప్పల వెంకన్న ఎన్ రెడ్డి హంసరెడ్డి కన్నం వెంకన్న మంద రవి ఎస్.కె నజీర్ తుకారాం నాయక్ గేయ రచయిత యోచన రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాగసుధ కుసుంబా బాబురావు నర్ర ప్రతాప్ కనకం సంధ్య గుండెబోయిన చంద్రయ్య మైదం శెట్టి రమేష్ తుడుం అనిల్ కుమార్ కంచ వెంకన్న మాలోతు జబ్బర్ నాయక్ కర్రోళ్ల శ్రీనివాస్ తాండ్ర కళావతి నీల రవీందర్ కర్ర రాజిరెడ్డి గడ్డం నాగార్జున పల్లె మురళి మాస్ సావిత్రి మహమ్మద్ రాజా సాహెబ్ మాలోతు సాగర్ కొత్తకొండ రాజమౌళి మాలి బాబురావు ముక్కేర రామస్వామి కేశెట్టి సదానందం సింగతి మల్లికార్జున్ జన్ను రమేష్ వందలాదిమంది కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యతేనే దోపిడి విముక్తికి మార్గం
మోడీ విధానాలు దేశానికి అత్యంత ప్రమాదకరం
ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్
నర్సంపేటలో ఎంసీపీఐ(యు) భారీ ప్రదర్శన -బహిరంగ సభ
ఆకట్టుకున్న కళారూపాలు, పాటలు
నర్సంపేట,నేటిధాత్రి:
దేశంలో పెరిగిపోతున్న దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయమని ఎంసిపిఐ (యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, పోలిట్ బ్యూరో సభ్యులు కుల్దీప్ సింగ్ అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసిపిఐ (యు) వ్యవస్థాపకులు, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా నర్సంపేటలోని నెక్కొండ రోడ్డు సర్కిల్ నుంచి సిటిజన్ క్లబ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీ ముందు కోలాటాలు డప్పు బృందం కళాకారుల ఆటపాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ముఖ్య అతిధులుగా హాజరైనా మద్దికాయల అశోక్ ఓంకార్, కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ దేశంలో మోడీ అనుసరిస్తున్న విధానాలు ప్రజలను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయని ఈ క్రమంలో మత వైరుధ్యాలు నియంతృత్వాన్ని పెంచి పోషిస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పాలకుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ఉద్యమిస్తే తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. ఆ దిశలో వర్గ సామాజిక పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.అరుణోదయ విమలక్క, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపెళ్లి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగయ్య, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఎస్ యు సి ఐ రాష్ట్ర నాయకులు గంగాధర్ లు మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ పీడిత ప్రజల పక్షాన పోరాడిన యోధుడని చట్టసభలకు వన్నె తెచ్చాడని రాజకీయ విలువలకు ఆదర్శాలకు త్యాగాలకు నిలువుటద్దంగా నిలిచాడని ఆయన కోరుకున్నట్లు లాల్ నీల్ ఐక్యతను పెంపొందించాలని ఆయన ఆశయ సాధనలో అంతరాలు లేని సమాజ స్థాపనకు చేయాలని పిలుపునిచ్చారు. ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలను పాఠ్యాంశంలో చేర్చి వారి గుర్తుగా స్మారక చిహ్నాలు మ్యూజియం ఏర్పాటు చేయాలని, కామ్రేడ్ ఓంకార్ పేరుతో నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి, స్టేడియంకు నర్సంపేట నుంచి వరంగల్ ప్రధాన రహదారికి నామకరణం చేయాలని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కాంస్య విగ్రహాలు పెట్టించాలని విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి వనం సుధాకర్ కుంభం సుకన్య గోనె కుమారస్వామి వస్కుల మట్టయ్య వరికుప్పల వెంకన్న ఎన్ రెడ్డి హంసరెడ్డి కన్నం వెంకన్న మంద రవి ఎస్.కె నజీర్ తుకారాం నాయక్ గేయ రచయిత యోచన రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాగసుధ కుసుంబా బాబురావు నర్ర ప్రతాప్ కనకం సంధ్య గుండెబోయిన చంద్రయ్య మైదం శెట్టి రమేష్ తుడుం అనిల్ కుమార్ కంచ వెంకన్న మాలోతు జబ్బర్ నాయక్ కర్రోళ్ల శ్రీనివాస్ తాండ్ర కళావతి నీల రవీందర్ కర్ర రాజిరెడ్డి గడ్డం నాగార్జున పల్లె మురళి మాస్ సావిత్రి మహమ్మద్ రాజా సాహెబ్ మాలోతు సాగర్ కొత్తకొండ రాజమౌళి మాలి బాబురావు ముక్కేర రామస్వామి కేశెట్టి సదానందం సింగతి మల్లికార్జున్ జన్ను రమేష్ వందలాదిమంది కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం
పరకాల,నేటిధాత్రి
మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు.45 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో నిరుద్యోగ మహిళలు,యువతులకు ఆధునిక కుట్టుపనిపై ఉచితంగా శిక్షణ అందించనున్నారు.శిక్షణ అనంతరం అర్హులకు ఉచిత కుట్టుమిషన్లు,సర్టిఫికెట్లు అందజేస్తామని నిర్వాహకులు కొక్కిరాల రాకేష్ రావు,చందా కుమారస్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి,కౌన్సిలర్ దుబాసివెంకటస్వామి,కొక్కిరాల దీప్తి, గందె వెంకటేశ్వర్లు,పంచగిరి శ్రీనివాస్,భగవాన్ రెడ్డి,ఇంగిలి వీరేష్ రావు,పిట్ట స్వప్న దేవేందర్,గంట కళావతి,దగ్గు సునీత,బండి వెంకటేష్, సాంబరాజు జ్యోతి,ఏకు రమేష్,బియాబాని,బొచ్చు వాసు,మక్సుద్,నాగరాజు,కోటి,సునీల్,ఆకాష్,అంబిర ఉమ,గందె అనిత,ఫౌండేషన్ సభ్యులు,శిక్షకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
పట్టపగలే దోపిడీ.. ప్రభుత్వ భూమిలో ఇష్ట రాజ్యాంగా మట్టి తవ్వకాలు.
అనంతగిరి, నేటి ధాత్రి :
ప్రభుత్వ భూమి నుండి పొలాల్లోకి యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు సమస్యగా మారుతోంది.ఈ ప్రక్రియ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండగా, ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండిపడుతోంది.వివరాలు వెళితే మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామ సమీపంలోని ఊర చెరువు వద్ద ప్రభుత్వ భూమి ఉంది.కొందరు ప్రభుత్వ భూమిలో మట్టి పంట పొలాల్లోకి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ సూచనల మేరకు రెవెన్యూ అధికారులు అక్రమంగా మట్టి తరలిస్తున్న దగ్గరికి వెళ్లి పరిశీలించగా అక్కడ జెసిబి ట్రాక్టర్లు ఉన్నాయి.అక్కడికి వెళ్లిన అధికారులు పట్టుకున్న వాహనాలను వదిలేశారు.పట్టుకున్న వాహనాలను అధికారులు వదిలేయడమేమిటని ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.ప్రభుత్వ భూమి నుండి అక్రమంగా మ ట్టిని తరలించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని క్షేత్రపాలకులు ఆంజనేయ స్వామి వారీని వివిధ రకాల పువ్వులతో అలంకరించి, ఆంజనేయ స్వామికి ఇష్టమైన పూజలు ఆకు పూజ చేసి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
యాదాద్రి నృసింహున్ని దర్శించుకున్న హై కోర్టు జడ్జి తిరుమలా దేవి
నేటి ధాత్రి యాదగిరిగుట్ట:
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంగళ వారం కుటుంబ సమేతంగా తెలంగాణ హై కోర్టు జడ్జి తిరుమలా దేవి దర్శించుకుని స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ ఈవో ఐఏఎస్ అధికారి భవాని శంకర్ స్వామివారి చిత్ర పటం మహా ప్రసాదం లడ్డూను అందజేశారు.
`కేరళ గెలుపుతో సిఎం రేవంత్ కు పార్టీలో పెరిగిన ప్రాధాన్యత.
`తెలంగాణ అభివృద్ధి కోసం వేదిక సాక్షిగా ప్రశ్నించిన సిఎం రేవంత్ రెడ్డి.
`మోడీ సిఎం గా వున్నపుడు యుపిఏ సహకరించిన తీరు గుర్తు చేశారు.
`గుజరాత్ మోడల్ కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అడిగినన్ని నిధులిచ్చారు.
`ఆ విషయం గుర్తు చేసి కాంగ్రెస్ సిఎం గా తన బాధ్యత నిర్వర్తించారు.
`నిధులు ఇవ్వమని కేంద్రాన్ని కోరడం వేరు.
`గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతం చూపించ లేదు అని గుర్తు చేయడం గొప్ప విషయం.
`అలా ప్రధాని మోడీని ప్రశ్నించిన సిఎం ఎవరూ లేరు.
`ఆ క్రెడిట్ కూడా సిఎం రేవంత్ రెడ్డికే దక్కింది.
`సమయం చూసి రాజకీయం చేయడంలో సిఎం రేవంత్ దిట్ట.
`ఢిల్లీకి వెళ్లి మోకారిళ్లడం కాదు, తెలంగాణ గడ్డ మీద ప్రశ్నించిన ఘనత సిఎం రేవంత్ కే దక్కింది.
`పరిపాలన పరంగా కలిసి సాగుతాం.. వివక్ష చూపిస్తే నిలదీస్తాం అని చెప్పకనే సిఎం రేవంత్ చెప్పారు.
`తన బాధ్యతను సగర్వంగా నిర్వర్తించారు.
`తెలంగాణ కోసం ఎవరినైనా ఎదిరిస్తాననని నిరూపించారు.
`అటు పార్టీపై పట్టు సాధించారు.
`కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఆలోచించుకునేలా చేశారు.
`తనపై కాంగ్రెస్ నాయకులు ఎవరూ పిర్యాదులు చేసినా అధిష్టానం నమ్మకుండా సంకేతం పంపారు.
`ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే వాస్తవం చేసి చూపించారు.
హైదరాబాద్, నేటిధాత్రి: సమాజంలో అన్ని వర్గాలలో వున్నట్లు రాజకీయాల్లో కూడా అదృష్టవంతులు, దురదృష్టవంతులు వుంటారు. కొంత మంది జీవితాంతం రాజకీయాలు చేసినా అవకాశాలు కలిసిరావు. అవకాశాలు వచ్చినట్లే వచ్చినా చేజారిపోతుంటాయి. అవకాశాలు ముందు వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోతుంటాయి. అలా ప్రతిసారి ఏదో రకమైన ఇబ్బంది ఎదురై జీవితాంతం పదవులు పొందని వాళ్లు అనేక మంది వున్నారు. కాని కొంత మందికి అవకాశాలు వరసుగా వస్తుంటాయి. అడపా దడపా చిన్న చిన్న సమస్యలు ఎదరైనా మళ్లీ వెంటనే మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ అవకాశాలు పొందుతుంటారు. ఎక్కువ పదవులు పొందుతుంటారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటినుంచి ఒక్కొమెటు ఎక్కుతూ ప్రజల్ని మెప్పిస్తూ నాయకుడైన వారు అతి కొద్ది మంది మాత్రమే వుంటారు. అలాంటి నాయకుల్లో సిఎం. రేవంత్ రెడ్డి ఒకరు. ఎవరి ప్రోత్సాహం లేకుండా, ఎవరి అండా దండా లేకుండా తన సూక్ష్మబుద్దితో రాజకీయాలు చేసి ఎదిగిన ఇంకా అతి కొద్ది మంది మాత్రమే వుంటారు. దేశ వ్యాప్తంగా చూసినా, చరిత్ర మొత్తం తిరగేసినా అలాంటి వారు ఇంకా అతికొద్ది మంది మాత్రమే వుంటారు. వాళ్లందరినీ వేళ్ల మీద లెక్కబెట్టేలా వుంటారు. అలాంటి వారిలో కూడా సిఎం. రేవంత్రెడ్డి ఒకరు. ఈ తరంలో ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి, రేవంత్రెడ్డి వరకు అలా ఎదిగి చరిత్ర సృష్టిస్తుంటారు. అలా చరిత్ర సృష్టించిన సిఎం. రేవంత్ రెడ్డి కష్టం, అదృష్టం రెండూ కలిసి పైకి వచ్చారు. ఎంతో కష్టపడి ఎదిగారు. అడుగడుగునా ఎదురైన సవాళ్లను ఎదరించి పైకొచ్చారు. ఆత్మస్ధైర్యం నింపుకొని పైకొచ్చారు. జీవితంలో ఒక్కసారి ఓటమి ఎదురైనా మళ్లీ ఆరు నెలల్లో దానిని గెలుపుగా మార్చుకొని నిలబడ్డారు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్లో అప్పటికే ఎంతో మంది సిఎం. కావాలన్న కలలు కంటున్న వారిని త్రోసిరాజని రేవంత్రెడ్డి సిఎం. అయ్యారు. అంటే అందులో ఆయన పడిన కష్టం ఎంతో మాటల్లో చెప్పలేనిది. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచే అవకాశాలు స్వాగతిస్తూ వచ్చాయి. ఆయనను ఉన్నత స్ధానం చేరుకునేలా చేశాయి. సహజంగా గత రెండు దశాబ్ధాల క్రితం నుంచి రాజకీయాలు చేస్తున్నవారిలో ఎవరూ స్వతంత్రంగా ఎదిగిన వారు పెద్దగా లేరు. కాని ఈ గత ఇరవై ఏళ్ల క్రితం నుంచి కూడా స్వతంత్రంగా ఎదిగిన ఏకైక నాయకుడిగా సిఎం. రేవంత్రెడ్డినే చెప్పొచ్చు. జడ్పీటీసి సభ్యుడు అంటే సగం ఎమ్మెల్యేతో సమానం. అలాంటి పదవి ఏదో ఒక పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినా ఒక్కొసారి గెలవడం కష్టం. అందులోనూ బలమైన పార్టీ అధికారంలో వున్నప్ప్పుడు ఇండిపెండెంటుగా గెలవడం అనేది అసాద్యం. కాని సిఎం. రేవంత్రెడ్డి నిలిచి గెలిచారు. గెలిచి నాయకుడయ్యారు. తన నయకత్వ ప్రస్తానానికి పునాది వేశారు. తన అప్రతిహత విజయాలకు బాటలు వేసుకున్నారు. ఆ వెంటనే ఇండిపెండెంటుగా శాసన మండలి సభ్యుడయ్యారు. అప్పటి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఏ పార్టీ అండ లేకుండా ఎమ్మెల్సీ కావడం అనేది అంత సులువైన పని కాదు. అసాద్యాన్ని సుసాధ్యం చేయడం జడ్పీటీసి నుంచే మొదలు పెట్టారు. తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో ఎంతో మంది రాజకీయాలు అక్కడే ఆగిపోయాయి. కాని అక్కడ కూడా రేవంత్రెడ్డి రాజకీయం ఆగిపోలేదు. అలసిపోలేదు. మరింత ముందుకు దూకుడుగా వెళ్లింది. తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడుగా వున్న సిఎం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరినప్ప్పుడు అందరూ చెరువులో నీటి చుక్క. సముద్రంలో తుమ్మర అనుకున్నారు. కాని ఆ సముద్రాన్ని ఒడిసిపట్టే నాయకుడు రేవంత్ రెడ్డి అవుతారని ఎవరూ అనుకోలేదు. అలా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర శాఖ అద్యక్షుడైన రేవంత్ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ధీరుడయ్యారు. పదేళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి బలమయ్యాడు. తనను అద్యక్షుడి చేసినందుకు పార్టీని అదికారంలోకి తీసుకొచ్చిన తనపై వుంచిన నమ్మకాన్ని నిజం చేశారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు. తెలంగాణ ఇచ్చినా అన్యాయమైపోయామన్న భాద నుంచి కాంగ్రెస్ను బైట పడేశారు. దక్షిణాది ఎప్ప్పుడూ కాంగ్రెస్కు అండగా వుంటుందన్న చరిత్రను మరోసారి నిజం చేశారు. అలా సిఎం. అయిన రేవంత్రెడ్డి తన ఇమేజ్ను పెంచుకుంటూ, కాంగ్రెస్ పార్టీ విస్తరణలో కూడా పాలు పంచుకుంటున్నాడు. విజయాలు అందిస్తున్నాడు. తాజాగా దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. అందులో కేరళ ఎన్నికల బాద్యతలను కాంగ్రెస్ అధిష్టానం సిఎం. రేవంత్ రెడ్డి మీద పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకోసం అనుసరించిన వ్యూహాలను అడుగడునా అమలు చేసి, కేరళలో కాంగ్రెస్ గెలుపుకు సిఎం. రేవంత్రెడ్డి ఇతోదిక కృషి చేశారు. కేరళలో కాంగ్రెస్ను ఒక రకంగా అదికారంలోకి తెచ్చారు. తనపై పార్టీ వుంచిన నమ్మకాన్ని మరోసారి నిజం చేసుకున్నారు. దక్షిణాదిలో మరో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేశారు. అయితే కేరళ ఎన్నికల ప్రచారంలో సిఎం. రేవంత్ కీలక భూమిక పోషించారు. 140 నియోజకవర్గాలలో సిఎం. రేవంత్రెడ్డి 70 నియోజకవర్గాలకు పైగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజులు మందు ఓవారం రోజుల పాటు విసృత ప్రచార పర్యటనలు చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. పెద్దఎత్తున రోడ్ షోలు చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను గుర్తు చేశారు. రైతు రుణమాఫీ గురించి చెప్పారు. రైతు భరోసా ఇస్తున్నామన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరతోపాటు, బోనస్ ఇచ్చే విషయాన్ని వెల్లడించి కేరళ ప్రజలను ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ వైపు జనం తిరిగేలా చేశారు. అలా ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్ గెలిచింది. సిఎం. రేవంత్ ప్రచారం నూటి నూరు శాతం సక్సెస్ అయ్యింది. ఆయన ఎక్కడెక్కడైతే ప్రచారం చేయలేదో అక్కడ ఎల్డీఎఫ్ గెలిచింది. రేవంత్రెడ్డి ప్రచారం చేసిన అన్ని ప్రాంతాలలోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పైగా కాంగ్రెస్ చరిత్రలోనే ఇంత పెద్ద విజయం కేరళలో సొంతం చేసుకోలేదు. ఇలా పార్టీలో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇక ఆయన ఈ మధ్యలోనే సాదించిన రెండో విజయం మరో అధ్భుతం. తెలంగాణలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ సభలో ప్రదాని మోడీ, సిఎం. రేవంత్ రెడ్డి ఇద్దరూ మాట్లాడారు .ఆ సమయంలో తెలంగాణ ప్రగతి కోసం కేంద్రం మరింతగా నిధులు ఇవ్వాలని సిఎం. రేవంత్రెడ్డి కోరారు. అయితే ఇందులో ఓ తిరకాసు పెట్టారు. గతంలో ప్రధాని మోడీ , గుజరాత్ సిఎంగా వున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రదాని మన్మోహన్ సింగ్ ఇతోదిక నిధులు ఇవ్వడం జరిగింది. గుజరాత్ మోడల్ అభివృద్దికి మన్మోహన్ సింగ్ సహకరించడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఫెడరల్ స్పూర్తితో గుజరాత్ మోడల్ కోసం అడిగినన్ని నిధులు మన్మోహన్ సింగ్ బేషజాలు లేకుండా ఇచ్చారు. ఇప్ప్పుడు అదే తరహా మోడల్ తెలంగాణ కోసం ప్రధాని మోడీ అవసరమైనన్ని నిధులు ఇవ్వాలని కోరారు. ఓ వైపు నిధులను అభ్యర్ధిస్తూనే మరో వైపు గతంలో తాము సహకరించినట్లు మీరు సహకరించాలని ఏకంగా ప్రధాని మోడీకే, సిఎం. రేవంత్ గతం గుర్తు చేశారు. ఫెడరల్ స్పూర్తిని మరోసారి గుర్తు తెచ్చుకునేలా చేశారు. దాంతో ప్రధాని మోడీకి ఏం చెప్పాలో అర్ధం కాని విషమ స్ధితిలోకి నెట్టేశారు. సిఎం. రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యం ఫ్రదాని మోడీ పసిగట్టేశారు. రాష్ట్ర అభివృద్ది కాంక్ష వున్న రేవంత్ రెడ్డి లాంటి నాయకులు రాజకీయాల్లో వుండాలన్నట్లు స్పందించారు. మాతో కలసి సాగండి. గుజరాత్కు ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులిస్తానని ప్రధాని మోడీ చెప్పేలా చేశారు. అలా సొంత గడ్డ మీద నుంచి ప్రధాని మోడీని ఇరుకున పెట్టిన సిఎం ఒక్క రెవంత్ రెడ్డి తప్ప మరొకరు లేరు. ముఖస్తుతి లేకుండా, రాష్ట్రం కోసం నిదులను కోరిన ఏకైక నాయకుడు సిఎం. రేవంత్రెడ్డి. దాంతో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మరింత పెరిగింది. అటు పార్టీలోనూ రేవంత్కు తిరగులేదు. ఇటు పాలనా పరంగా కేంద్రం నుంచి ప్రశంసలందుకున్నారు.
అర్ధరాత్రి అంతర్జిల్లా చెక్పోస్ట్ను తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ.
తాండూరు,మంచిర్యాల: నేటి ధాత్రి :
బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు మంచిర్యాల జోన్ తాండూర్ రేపల్లెవాడ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి వాహనాల తనిఖీలను పర్యవేక్షించారు. చెక్పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించిన డీసీపీ, విధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు.ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అక్రమ పశువుల రవాణాపై పటిష్ట నిఘా కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అనుమానాస్పద రవాణా గమనించినట్లయితే స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని,భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. డీసీపీ వెంట తాండూర్ సీఐ దేవయ్య,బెల్లంపల్లి వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు, తాండూర్ ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పదిలో ఫెయిలైన విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు ప్రారంభం
నరేంద్రనగర్లో క్యాంపును ప్రారంభించిన కలెక్టర్ సత్య శారద
జూన్ 3 వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ప్రత్యేక బోధన
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జిల్లాలో ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. సోమవారం వరంగల్ జీహెచ్ఎస్ నరేంద్రనగర్ పాఠశాలలో క్యాంపును ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదిలో ఫెయిల్ అవడం జీవితంలో ఓటమి కాదని, మరింత బలంగా ముందుకు సాగేందుకు ఒక అవకాశమని పేర్కొన్నారు. విద్యార్థులు నిరుత్సాహానికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో తిరిగి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చదువులోని లోపాలను సరిదిద్దుకోవాలని, మానసిక స్థైర్యం పెంపొందించేందుకు కౌన్సెలింగ్, సబ్జెక్టు వారీగా రెమిడీయల్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు.అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో భయాలను తొలగించి చదువుపై ఆసక్తి పెంచేందుకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తామన్నారు. తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా క్యాంపులకు పంపించాలని కోరారు.డీఈఓ రంగయ్యనాయుడు మాట్లాడుతూ.. మోడల్ పరీక్షలు, డౌట్ క్లారిఫికేషన్ సెషన్లు నిర్వహిస్తామని, విద్యార్థులందరూ పాస్ అయ్యేలా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.జీహెచ్ఎస్ నరేంద్రనగర్తో పాటు జెడ్పీహెచ్ఎస్ (బాలికలు) నర్సంపేటలో క్యాంపులు ఏర్పాటు చేశారు. తొలిరోజు గీసుగొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల నుంచి 70 మంది విద్యార్థులు నరేంద్రనగర్ క్యాంపునకు హాజరయ్యారు. ఈ క్యాంపులు మే 12 నుంచి జూన్ 3 వరకు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఈకార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్ తేజ, డీడబ్ల్యూఓ రాజమణి, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
*భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు*
*పరకాల,నేటిధాత్రి*
మండలంలోని మల్లక్కపేట గ్రామ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.దేవాలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించగా భజనలు, నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.
మధ్యాహ్నం 1 గంట నుండి మాల విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారికి 108 తమలపాకులతో,108 వడపేర్లతో ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు కాటూరి జగన్నాథ చార్యులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామం నుండి పరకాల కలిపే రహదారి నిర్మాణానికి మాత్రం మోక్షం లభించడం లేదు గత ఏండ్లు గా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టా లని స్థానిక ప్రజాప్రతినిధులకు కోరిన ఈ రహదారి మాత్రం మోక్షం కలుగడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం శిలాఫలకం వేసి రోడ్డుకు కంకర పోసి విడిచిపెట్టడం ద్వారా గ్రామ రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో రోడ్డు గుంతలు గుంతలుగా మారి కంకర తేలి అటువైపు వాహనాలు వెళ్లా లంటే ప్రజలు భయ పడుతు న్నారు రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం ద్వారా వాహన దారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేస్తే పరకాల దారి ప్రజలకు దూరభారం తగ్గు తుంది కాబట్టి గ్రామంలో ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం ఈ రహదారిపై దృష్టిపెట్టి రోడ్డు నిర్మాణం జరిగేలా చూడాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.
శాయంపేట మండల కేంద్రం లోని ఆరేపల్లి, వసంతాపూర్ గ్రామాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల భాగంగా రైతు ముంగుట్లోకి శాస్త్రవేత్తలు సాగుచేసే పద్ధ తులపై,, ఎఫ్ పిఓ ల ప్రాము ఖ్యత అవగాహన కల్పిం చారు. రానున్న వానకాలం సాగుకై మెరుగైన సాగు పద్ధ తులపై అవగాహన కల్పిం చేందుకు ఆరేపల్లి గ్రామంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ డా.టి.శ్రీజయ మాట్లాడుతూ యూరియా వాడకాన్ని తగ్గిం చమని చెబుతూ పంట వ్యర్థా లను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని వివరిం చారు పొలంలో గుంతలు చేసి పంటవ్యర్థాలను గుంతలో వేసి ఎరువు తయారు చేసు కొని దాన్ని పొలంలో జల్లుకో వాలని చెప్పారు.
నేలల్లోనీ సారం పెంచుకోవడానికి సేంద్రియ ఎరువులు పచ్చిరొట్ట ఎరువులు వాడకం ద్వారా చేయవచ్చని అవగాహన కల్పించారు. రైతాంగాన్ని ప్రధాన పంట వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేయవలసిం దిగా కోరారు ప్రతీ రైతు కచ్చి తంగా భూసార పరీక్షలు చే యించుకొని దానికి అను గుణంగా ఎరువులు వేసుకో వాలని సూచించారు. అనం తరం వ్యవసాయ కళాశాల ఉద్యాన శాస్త్ర సహా ఉపాధ్యా యులు డా. ఎస్. వంశీ కృష్ణ పలు ఉద్యాన పంటల సాగు విధానం మరియు ఆయిల్ పామ్ పంట ప్రాముఖ్యతను మరియు సస్యరక్షణ పద్ధ తులు గురించి వివరించారు. తరువాత గ్రామ సర్పంచ్ రమ మాట్లాడుతూ ఈ కార్యక్రమా న్ని మా గ్రామంలో నిర్వహించి నందుకు అధికారులకు కృత జ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని, వ్యవసాయ విస్తరణ అధికారి జోష్ణ, ప్రజ్వ ల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఎన్జీవో రాంబాబు, వ్యవసా య కళాశాల విద్యార్థులు దేవేందు, శివాజీ , వసంత పూర్ సర్పంచ్ భాస్కర్, రైతులు, ఆరేపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మంగళవారం నర్సింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి ఆసుపత్రి సూపరిండెంట్ గౌతమ్ చౌహన్,వైద్యులు,నర్సింగ్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సూపరిండెంట్ గౌతమ్ చౌహన్ మాట్లాడుతూ రోగుల సేవలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని,వారి సేవలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నర్సులు అందించే సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు బాలకృష్ణ,మహేష్,హారిక, సంగీత,నర్సింగ్ సూపరిండెంట్ రమాదేవి,హెడ్ నర్సులు నాగమణి,ప్రసన్న, శారద,జ్యోతి,రజని,స్టాఫ్ నర్సులు భాగ్యలక్ష్మి,స్వాతి, సుప్రజ,సునీత,సుమలత,సుధా,రాణి తదితరులు పాల్గొన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ బహిరంగ సభలో చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చడమే కాకుండా నిరుత్సాహపర్చింది. నీతి సూత్రాలు వల్లించి ఊకదంపుడుగా ఉపన్యాసం చేశారు. అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నాడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు అడ్డుకుంటున్నారు? రాష్ట్రానికి ఆర్థికంగా రావాల్సిన నిధులు ఎందుకు తగ్గుతున్నాయి? అనే విషయాలకు సమాధానం చెప్పలేదు.
రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మాతో జట్టుకట్టండని, తమకు అనుకూలంగా వ్యవహరించాలని, ముఖ్యమంత్రికి పరోక్షంగా మోడీ సంకేతమివ్వడం రాజ్యాంగ విరుద్ధం. పెట్రోల్ వాడకాన్ని నియంత్రించాలని, ప్రజారవాణాలోను, మెట్రోరైల్లో వెళ్ళాలని, బంగారం కొనొద్దని, విదేశీ పర్యటనలు చేయొద్దని, నిత్యావసర సరుకుల ధరలు పెరగబోతున్నాయని సంకేతాన్ని ఇచ్చారు. కానీ ధరలు పెరగడానికి ప్రధానకారణమైన యుద్ధాన్ని ఆపకుండా, అమెరికా అధ్యక్షుడి ముందు మోకరిల్లే వైఖరిని ప్రభుత్వం అనుసరిస్తోంది. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ బిల్లు తెచ్చి విద్యుత్తును ప్రైవేటుపరం చేసే విధానాలు అమలు చేస్తున్నది.
మోడీ ఉపన్యాసంలో తెలంగాణ రాష్ట్ర సమస్యల ప్రస్తావన లేకుండా రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలనే అంశం మీదనే కేంద్రీకరణ కనిపిస్తున్నది. మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ తెలంగాణ గడ్డ, అదే పోరాట స్ఫూర్తితోనే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజానీకానికి సిపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తున్నది. అని వారు అన్నారు
*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా, మెడిటేషన్ కార్యక్రమం*
*పరకాల,నేటిధాత్రి*
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో యోగా మరియు మెడిటేషన్పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఆయుష్ మిషన్కు చెందిన యోగ గురువు బోగా రఘుపతి హాజరై విద్యార్థులు,అధ్యాపకులతో కలిసి యోగాసనాలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా బోగా రఘుపతి మాట్లాడుతూ నిత్యజీవితంలో యోగా ప్రతి ఒక్కరికీ అవసరమని,ఆరోగ్యవంతమైన జీవితానికి యోగాసనాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని విద్యార్థులకు సూచించారు.కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ సంకల్పంతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని అన్నారు.యోగా,ధ్యానం ద్వారా మానసిక ఉల్లాసం,ఏకాగ్రత,స్థైర్యం పెరుగుతాయని తెలిపారు.విద్యతో పాటు వారంలో రెండు రోజులు కళాశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.మల్లయ్య,ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏ.శ్రీనివాస్ రెడ్డి,స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎలిషాల అశోక్,డాక్టర్ జి.పావని, కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ జి.రాజేశ్వర్ కుమార్,అధ్యాపకులు డాక్టర్ భీమ్ రావు,బి.మహేంద్రరావు,డాక్టర్ ఆడెపు రమేష్,డాక్టర్ కే. జగదీష్ బాబు,ఏం.సమ్మయ్య,ఆర్.ఈశ్వరయ్య,ఎస్.రాజశ్రీ,డాక్టర్ డి. సంజయ్ కుమార్,పవన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆఫీస్ సిబ్బంది వంశీ, కృష్ణ కూడా హాజరయ్యారు.
అక్రమ రవాణా నిర్మూలన కోసం చెక్ పోస్ట్ లు .. క్షుణ్ణంగా తనిఖీలు.
సూర్యాపేట జిల్లా ఎస్పి కె. నరసింహ ఐపీఎస్
సూర్యాపేట, నేటి ధాత్రి:
పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పోలీసు శాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి నరసింహ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో 24 గంటలు విసృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికిచేస్తునట్లు తెలిపారు.మంగళవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 65 పై టేకుమట్ల వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్ జిల్లా ఎస్పీ నరసింహ సందర్శించి వాహనాల తనిఖీలను,చెక్ పోస్ట్ రికార్డులను పరిశీలించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల సమయంలో చెక్ పోస్ట్ సిబ్బంది స్వీయ రక్షణ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాలలో అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ చెక్ పోస్ట్ ల ద్వారా అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానత వ్యక్తులకు కదలికలపై పూర్తిస్థాయి నిఘా ఉంచామన్నారు. వరి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా, పీడీఎస్ బియ్యం, ఇసుక, పశువుల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన నిఘా ఉంచి రాత్రిం బవళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడినట్లైతే అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం సంతలో కొనుగోలు చేసిన పశువుల రవాణా చేస్తే సంత అధికారులు, పశువుల వైద్యుల అనుమతి పత్రాలు వెంట తీసుకువెళ్ళాలి అన్నారు.ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్, చెక్ పోస్ట్ విధులు నిర్వహణ సిబ్బంది, జాతీయ రహదారుల సిబ్బంది ఉన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.