స్ధానిక బిడ్డను-అందరికి అందుబాటులో ఉంటున్న నన్ను మరొక్కసారి ఆశీర్వదించండి- సుంకె రవిశంకర్
రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని దత్తోజిపేట్, రంగసాయిపల్లి, రుద్రారం, గౌండ్లపల్లి గ్రామాలలో చోప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో రవిశంకర్ కి ప్రజలు డప్పు చప్పులతో గులాబీ పూలతో ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ నవంబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పక్ష పార్టీలకు ఓటేస్తే మోసపోయి గోసపడతామని తెలిపారు. బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఉందన్నారు….