నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శశిధర్
మందమర్రి, నేటిధాత్రి:- మందమర్రి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా కే శశిధర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు సిఐగా విధులు నిర్వహించిన జి మహేందర్ రెడ్డి వరంగల్ కమీషనరేట్ పరిధిలోని పాలకుర్తి కి బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో విధులు నిర్వహిస్తున్న కే శశిధర్ బదిలీపై మందమర్రి సర్కిల్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పర్యవేక్షణకు కృషి చేస్తానని తెలిపారు.