ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ కాలనీలో 26 28 38 పోలింగ్ బూత్ లో ఇంటింటికి ప్రచారాన్ని బూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో తొట్ల స్వామి చోట గోపాల అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్ హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని మూడవసారి దేశ ప్రధానిగా ప్రజలు చూడబోతున్నారని అన్నారు వరంగల్ పార్లమెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి కేంద్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అవినీతి అక్రమాలు పాల్పడింది ఆ యొక్క అవినీతి అక్రమాలను పక్కకు పెట్టి ఇండియా కూటమి పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తుంది రాష్ట్రంలో అమలు కానీ హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు ఇలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ ని కొనియాడుతున్నారని కానీ మన దేశంలోని కొన్ని దేశద్రోహ వ్యక్తులు బిజెపిని విమర్శలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాంపల్లి కుమార్ ఓబీసీ మోర్చా అర్బన్ అధ్యక్షులు మరియు గట్ల శ్రీనివాస్ తోట్ల స్వామి చట్టగొప్పుల అర్జున్ హరీష్ సంతోష్ సారంగపాణి వేణు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *