భూపాలపల్లి నేటిధాత్రి
ఎమ్మార్పీఎస్ టిఎస్ అనుబంధ సింగరేణి ఉద్యోగుల ఫెడరేషన్ సంఘo రాష్ట్ర అధ్యక్షులుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రేగుంట నర్సయ్య మాదిగను నియమించిన ఎమ్మార్పీఎస్ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ నియామక పత్రం నర్సయ్య మాదిగకి అందజేశారు. ఈ సందర్బంగా నర్సయ్య మాదిగ మాట్లాడుతూ సంఘము ఏ బాధ్యతలు అప్పగించిన పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తానని,సంఘము బలోపేతం చేయడం కోసం కృషిచేస్తానని అన్నారు. అనంతరం నర్సయ్య మాదిగకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా ఇంచార్జి గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు