చలివేంద్రాన్ని ప్రారంభించిన టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ చింతల్ ఘట్ ఎక్స్ రోడ్లో టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ మాట్లాడుతూ ఎండాకాలం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోష కరం అన్నారు టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ స్పోక్ పర్సన్ నసీర్ రుద్దీన్ మాట్లాడుతూ తండ్రి బాటలో తనయుడు అంకితభావం సేవ గుణంతో ముందుకెళ్తున్నటువంటి తన్వీర్ గారికి మైనార్టీ వర్గంతో పాటు అన్ని వర్గాల మద్దతు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.